ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన ఓ షాకింగ్ ఘటనలో నవ వధువు మృతి చెందింది. పెళ్లి జరిగిన మరునాడే ఈ ఘటన జరిగింది. ఆ నవ వధువు స్నానం చేసేందుకు తన అత్తమామల ఇంట్లోని బాత్రూమ్కి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ బాత్రూమ్ నుంచి రాకపోవడంతో కుటుంబ సభ్యులు డోర్లు పగల గొట్టి చూడటంతో అసలు విషయం తెలిసింది.
బాత్రూమ్లోని ఓ మూలలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించారు. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
నవ వధువు మృతిరి కారణాలను వైద్యులు విశ్లేషించారు. ఇందులో.. గ్యాస్ గీజర్లు కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తుంది. ఇది పీల్చిన కొద్ది నిమిషాల్లోనే మృత్యువొడిలోకి జారుకుంటారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమైనది. ఈ గ్యాస్ పీల్చిన మరుక్షణమే మైకంలోకి జారుకుంటారు. ఆ తర్వాత అపస్మారక స్థితిని వెళ్లిపోతారు. అయితే వెంటనే గుర్తించి వైద్యులకు చూపిస్తే ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది.
గ్యాస్ గీజర్ల వాడకం మూర్ఛ వ్యాధికి దోహదపడిందని గతంలో చెప్పేవారు. అయితే, గ్యాస్ గీజర్ని ఉపయోగిస్తున్నవారు తప్పకుండా వారు వినియోగిస్తున్న బాత్రూమ్లో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవలి. మంచి గాలి వచ్చే బాత్రూమ్లో మాత్రమే స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, చాలా సందర్భాలలో కొన్ని నెలలపాటు ఉపయోగించే యాంటీ-సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. ఐదు నిమిషాలకు పైగా గ్యాస్ను పీల్చడం వల్ల తలతిరగవచ్చు. ఇది ఎక్కువసేపు ఉంటే ముందుగా స్పృహ కోల్పోవచ్చు.. ఆ తర్వాత ఊపిరాడక చనిపోవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్