Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. వ్యవసాయ బావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు

ఖమ్మం జిల్లాలో ఘోరం నెలకొంది. రూరల్ మండలం సత్యనారాయణపురంలో ప్రమాదవశాత్తు పేరలా సాయి(7) అనే బాలుడు వ్యవసాయ బావిలో

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. వ్యవసాయ బావిలో పడ్డ ఏడేళ్ల బాలుడు
S
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 22, 2021 | 9:47 AM

Khammam – Boy – Farm well: ఖమ్మం జిల్లాలో ఘోరం నెలకొంది. రూరల్ మండలం సత్యనారాయణపురంలో ప్రమాదవశాత్తు పేరలా సాయి(7) అనే బాలుడు వ్యవసాయ బావిలో పడ్డాడు. బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

చివరికి సాయి మృతదేహం బావిలో కనిపించింది. దీంతో తమ కుమారుడి మృతదేహాన్ని చూసి బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు పోలీసులు.

మరో ప్రమాదకర ఘటనలో.. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది ఒక ఆర్టీసీ లగ్జరీ బస్సు. కొత్తగూడెం డిపో చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికుల సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.