ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్

ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారంలోకి దిగి ఉన్నత శిఖరాలకు చేరాడు.. ఇలాంటి కథలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాస్తవానికి, ఇలాంటి..

ఒక మహిళ రూ. 10 వేలతో వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ ఉంది. ఆమె మరెవరోకాదు, నీతా అడప్పా. ఒక బ్రాండ్
Follow us

|

Updated on: Feb 04, 2021 | 2:35 AM

ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారంలోకి దిగి ఉన్నత శిఖరాలకు చేరాడు.. ఇలాంటి కథలు భారతదేశంలో చాలా ఉన్నాయి. వాస్తవానికి, ఇలాంటి ఆలోచన చేయడమే అత్యంత కీలకమైనది, చాలా ముఖ్యమైనది. మీ వ్యాపార ఆలోచన సామాన్యమైనదే అయినా, ఆచరణ చాలా భిన్నంగా, ప్రజలను ప్రభావితం చేసేదిగా ఉండటమే ఇక్కడ ఇంపార్టెంట్. అలా అయితేనే విజయం మీకు మోకరిల్లుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే బెంగళూరు నివాసి అయిన నీతా అడప్పా.

నీతా అడప్పా తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలన్న ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా ప్రణాళికాయుతంగా ముందుకు సాగారు. కేవలం పది అంటే పదివేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించిన నీతా అడప్పా ఇవాళ కోట్ల టర్నోవర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. నీతా ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువతి. ఆమె ఫాదర్ ఒక మూలికా ఉత్పత్తి తయారీ సంస్థలో సేల్స్ మేనేజర్. నీతా ముంబైలోని ఒక కళాశాల నుండి ఫార్మసీలో మాస్టర్స్ చేసింది.

ఆ తరువాత ఆమెకు మరింత చదువుకోవడానికి, లేదా విదేశాలకు వెళ్లడానికి, ఇంకా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమె మూడవ ఐచ్చికాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగం చేయడం ప్రారంభించారు. అయితే, ఆ ఉద్యోగం ఆమెకున్న విజన్ ముందు వెలవెలబోయింది. 6 నెలల్లోనే ఉద్యోగానికి వీడ్కోలు చెప్పేసింది. అంతే, సొంత వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగిపోయింది. ఇది 1995 నాటి సంగతి.

అప్పటి సామాజిక పరిస్థితుల్లో ఒక స్త్రీ వదిలి వ్యాపారం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇవన్నీ లెక్కచేయక, నీతా అడప్పా విభిన్నమైన వ్యూహంతో పనిచేసింది. సరికొత్త ఎత్తులతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని గాఢంగా నిర్ణయించుకుని ‘ప్రకృతి హెర్బల్స్’ అనే సంస్థను ప్రారంభించింది. ఆమె కాలేజ్ జూనియర్ అనిషా దేశాయ్ ఈ పనిలో ఆమెకు మద్దతు ఇచ్చింది. జుట్టు సంరక్షణ, చర్మ సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తులపై సుదీర్ఘ పరిశోధనల తరువాత వారిద్దరూ 10 వేల రూపాయలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు.

అప్పటికే, జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీతా తన వ్యాపారాన్ని ఒక వినూత్నమైన పద్ధతితో ముందుకు తీసుకువెళ్లింది. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తుల తయారీ ప్రారంభించింది. ఈ క్రమంలో తనకున్న ఆర్థిక పరిమితులకు లోబడి మొదట హోటల్స్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. బెంగళూరులోని ఒక చిన్న హోటల్ నుండి ఆర్డర్లు పొందడం ప్రారంభించింది. ఇలా మొదలైన ఆమె జర్నీ, ప్రస్తుతం అనేక ఫైవ్ స్టార్ హోటళ్లకు తన ఉత్పత్తులు విక్రయిస్తోంది.

ఇక, హోటల్ రంగంలో స్థిరమైన విజయాన్ని సాధించిన తర్వాత, ఆమె, 2011 లో రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఫేస్ స్క్రబ్స్, హెయిర్ మాస్క్, హెయిర్ ఆయిల్, షాంపూలు, కండీషనర్ ఉత్పత్తులను అమ్మడం కూడా ప్రారంభించారు. ఇవి రూ .180 నుండి 300 రూపాయల వరకు వివిధ ధరలలో లభిస్తాయి. ఆమె తన ఉత్పత్తుల్ని వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ పోర్టల్స్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఇప్పుడు ఆమె వ్యాపారం ఈ స్థాయికి చేరడానికి నీతా అడప్పా ధృఢ సంకల్పం, కృషి, విభిన్నమైన ఆలోచనలే. అందుకే అప్పటి 10 వేల రూపాయల పెట్టుబడితో మొదలై ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది… ఇదీ.. నీతా అడప్పా సక్సెస్ స్టోరీ.

యావత్ దేశానికే ఆదర్శప్రాయం: బాలికలలో విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాల వంటి రుగ్మతలపై పోరాడటానికి పరుగులు

కరోనా మహమ్మారి ఫుణ్యమాని ఫైజర్ పంటపండుతోంది. ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ అమ్మకం ద్వారా వచ్చే ధనరాశులెన్నో తెలుసా?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు