
హిందూ మత గ్రంధాల ప్రకారం వంట గదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనిషి జీవితానికి మూలమైన ఆహారం విషయంలో కూడా వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. అందుకే భోజనం చేసే సమయంలో కచ్చితంగా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ భోజనం విషయంలో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలి.? పాటించకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండాలంటే అన్నపూర్ణ దేవిని ప్రసన్నం చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇందుకోసం వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఇందులో భాగంగానే వీలైనంత వరకు రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలు కడిగేయాలని సూచిస్తున్నారు. ఉదయం లేవగానే రాత్రి తిన్న పాత్రలను చూడకూడదనేది వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక ఆహారం వండే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఆహారం వండేప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా స్నానం చేసి తర్వాత మాత్రమే ఆహారాన్ని వండంచాలి. అలాగే.. వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణాభిముఖంగా ఆహారాన్ని ఎప్పుడూ వండకూడదు. ఆహారం వండడానికి ఉత్తరం లేదా తూర్పు దిక్కు శుభప్రదంగా వాస్తు పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా ఆహారాన్ని వృధా చేయడం వల్ల కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఆహారం వృధా చేయడం వల్ల తల్లి లక్ష్మికి కోపం వస్తుంది.
అందుకే వీలైనంత వరకు ఆహారాన్ని వృథా చేయకూడదు. ఒకవేళ ఆహారం మిగిలిపోతే పేదలకు పంచడం లాంటివి చేయకూడదని, చెత్తలో వేయకూడదని సూచిస్తున్నారు. ఇక ఆహారం తిన్న వెంటనే ప్లేట్లో చేయి కడుక్కోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ అలవాటు కారణంగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తినే ప్లేట్లో చేతులు కడుక్కోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతారు. కాబట్టి తిన్న ప్లేట్లో చేతి కడుక్కునే అలవాటును మార్చుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..