రోడ్డుపై వెళ్తున్న వారికి అడ్డొచ్చిన అనుకోని అతిథి.. చూడగానే ప్రాణం కోల్పోయిన మహిళ

| Edited By: Balaraju Goud

Aug 09, 2024 | 1:01 PM

సాధారణంగా పాము కాటు వేస్తే ప్రాణాపాయంగా మారుతుంది. తొందరగా మేల్కొని సకాలంలో వైద్య సేవలు అందితే సరే.. లేకుంటే ప్రాణాలు పోతాయి. కానీ పాము కనిపించగానే ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

రోడ్డుపై వెళ్తున్న వారికి అడ్డొచ్చిన అనుకోని అతిథి.. చూడగానే ప్రాణం కోల్పోయిన మహిళ
Woman Lost Llife
Follow us on

సాధారణంగా పాము కాటు వేస్తే ప్రాణాపాయంగా మారుతుంది. తొందరగా మేల్కొని సకాలంలో వైద్య సేవలు అందితే సరే.. లేకుంటే ప్రాణాలు పోతాయి. కానీ పాము కనిపించగానే ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

పెందుర్తి ప్రాంతానికి చెందిన కోటిపల్లి నాగేశ్వరరావు.. తన భార్య పాపరత్నంతో కలిసి నర్సీపట్నం వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి తిరిగి బయలుదేరారు. గురువారం(ఆగస్ట్ 8) రాత్రి 8 గంటల సమయంలో తిరిగి పెందుర్తికి వెళ్తున్నారు. కొండల అగ్రహారం సమీపంలోకి వచ్చేసరికి ఏలేరు కాలువ పక్క నుంచి ప్రయాణిస్తున్నారు. బైక్ పై వెళుతూ ఉండగా.. రోడ్డుపై ఓ పాము కనిపించింది. దీంతో ఆందోళన చెందిన నాగేశ్వరరావు వాహనాన్ని ఆ పామును తప్పించబోయాడు.

బైక్ పక్కకు తిప్పడంతో అదుపుతప్పి వాహనంతో సహా భార్య భర్తలు ఇద్దరూ ఏలేరు కాలువలో పడిపోయారు. నాగేశ్వరరావుకు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకున్నాడు. భార్య కోసం వెతికాడు. చీకటి కావడంతో రహదారిపై వెళ్తున్న మరో ఇద్దరికి విషయం తెలుసుకుని నాగేశ్వరరావును ఆరా తీశారు. ముగ్గురు కలిసి పాప రత్నం ఆచూకీ కోసం గాలించారు. కాలువ గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పాపరత్నం భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. దీంతో అక్కడికి వెళ్లి చూసి.. బయటకు లాగారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు నాగేశ్వరరావు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…