Diabetes: డయాబెటిక్ పేషెంట్స్‌కి అలెర్ట్.. శరీరంలోని ఆ భాగాలపై డయాబెటిస్‌ ప్రభావం.. వెంటనే జాగ్రత్త పడకపోతే అంతే సంగతీ..

మధుమేహం మన శరీరంలోని కొన్ని అవయవాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఆయా శరీర భాగాలతో సంబంధమున్న వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుంది. మధుమేహం కారణంగా తరచుగా..

Diabetes: డయాబెటిక్ పేషెంట్స్‌కి అలెర్ట్.. శరీరంలోని ఆ భాగాలపై డయాబెటిస్‌ ప్రభావం.. వెంటనే జాగ్రత్త పడకపోతే అంతే సంగతీ..
Diabetes symptoms
Follow us

|

Updated on: Jan 20, 2023 | 11:23 AM

భారత్‌లో మధుమేహం(డయాబెటీస్) చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమయిన ఈ వ్యాధి ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సం‍స్థ(WHO) లెక్కల ప్రకారం మన దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 7  కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నారు. అలాగే మరో రెండురన్నర కోట్ల మంది ప్రీ డయాబెటిస్‌‌తో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సాధారణ రోగంలా అలా వదిలేయడానికి లేదు. రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోకపోతే దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలు కూడా పాడయ్యే ప్రమాదం పొంచి ఉంది. చివరికి ప్రాణాలను కూడా హరిస్తుంది. ఇది జీవన శైలి వ్యాధి కనుక ఒక్కసారి వచ్చిందంటే శాశ్వతంగా తొలగించలేం. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులో ఉంచుకోవడమే శరణ్యం.

అయితే ఈ క్రమంలోనే మధుమేహం మన శరీరంలోని కొన్ని అవయవాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఆయా శరీర భాగాలతో సంబంధమున్న వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుంది. మధుమేహం కారణంగా తరచుగా మూత్రవిసర్జన కావడం, దాహం పెరగడం, అలసట, అస్పష్టమైన కంటి చూపు, అనుకోకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలతోపాటు అంతర్గతంగా రక్తనాళాలు చిట్లిపోవడం, అవయవాలకు రక్తం సరఫరాలో అంతరాయం కలగడం వంటివి కూడా కనిపిస్తుంటాయి. శరీరంలో వివిధ భాగాల్లో తలెత్తే కొన్ని లక్షణాలపై ఓ కన్నేయడం చాలా అవసరం. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. కళ్లు: రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కంటి రెటీనాలోని రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. ఇది అస్పష్టమైన దృష్టి, కంటిశుక్లం, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి వంటి కంటి సంబంధ సమస్యలకు దారితీస్తుంది. సమస్యకు చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే దృష్టి నష్టం కలిగించడంతో పాటు అంధత్వానికి కూడా దారితీస్తుంది.
  2. పాదాలు: మధుమేహం పాదాలపై కూడా ప్రభావం చూపుతుంది. నరాలు దెబ్బతినడం అనేది పాదం ఎలాంటి అనుభూతిని పొందకుండా చేస్తుంది. పాదాలలో పేలవమైన రక్త ప్రసరణ సమస్య కూడా వస్తుంది. పుండ్లు, ఇన్‌ఫెక్షన్‌కు గురైన సందర్భాల్లో చికిత్స చేయకుండా వదిలేస్తే కాలక్రమేణా పాదాలను తొలగించాల్సి వస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మూత్రపిండాలు: మూత్రపిండాలు శరీరంలోని విషపదార్ధాలు, వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలో సాయపడుతాయి. కిడ్నీల్లో ఉండే చిన్న రక్త నాళాలకు రక్తంలో అధిక చక్కెర హాని కలిగించవచ్చు. ఫలితంగా డయాబెటిక్ కిడ్నీ వ్యాధికి దారి తీస్తుంది. దీనిని డయాబెటిక్ నెఫ్రోపతీ అని కూడా పిలుస్తారు. మూత్రంలో ప్రోటీన్, మూత్ర విసర్జన అవసరం పెరగడం, రక్తపోటు నియంత్రణ మరింత దిగజారడం, పాదాలు, చీలమండలు, చేతులు, కళ్లలో వాపు, వికారం, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  5. నరాలు: డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతీ మాదిరిగానే.. రక్తంలో అధిక చక్కెరలు డయాబెటిక్ న్యూరోపతి అని పిలిచే నరాల దెబ్బతినడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిలో తిమ్మిరి లేదా నొప్పి లేదా ఉష్ణోగ్రతను అనుభవించే సామర్థ్యం తగ్గిపోవడం, మంట, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే, తీవ్రమైన పాదాల పూతలు, అంటువ్యాధుల వంటి మరిన్ని లక్షణాలకు దారితీయవచ్చు.
  6. గుండె, రక్తనాళాలు: అధిక బ్లడ్ షుగర్ రక్తనాళాలకు హాని కలిగిస్తుంది. అందుకని డయాబెటిక్ వల్ల స్ట్రోక్, గుండె జబ్బులతో పాటు కార్డియోవాస్కులర్ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వ్యక్తులు అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఇతర పరిస్థితులను కూడా కలిగి ఉంటారు.
  7. చిగుళ్లు: చిగుళ్ల వ్యాధినే పీరియాంటల్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది రక్తంలో అధిక చక్కెరతో ముడిపడి ఉన్న ఒక సాధారణ పరిస్థితి. ఇది సాధారణంగా చిగుళ్లకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు మందంగా తయారవడం వల్ల సంభవిస్తుంది. దీంతో కండరాలు కూడా బలహీనపడతాయి. ఇంకా రక్తంలో అధిక చక్కెర స్థాయిలు సాధారణంగా చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి. చిగుళ్లలో రక్తస్రావం, నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయి.

మధుమేహానికి నివారణ:

డయాబెటీస్  సమస్య ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన ఆహారం, జీవనశైలి లేకపోవడం కూడా మధుమేహాన్ని స్వాగతించినట్లే అవుతుంది. అయితే మధుమేహం రాకుండా జాగ్రత్త పడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్‌తో పాటు దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన, తక్కువ ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. సరిపడినంత బరువును కలిగి ఉండేలా చూసుకోవాలి. శారీరక శ్రమ, సాధారణ వ్యాయామం అలవర్చుకోవాలి. సిగరెట్‌ స్మోకింగ్‌, ఆల్కహాల్‌ తాగడం వంటి అనారోగ్య అలవాట్లను పరిమితం చేసుకోవాలి. ముఖ్యంగా వైద్యుడిని సంప్రదించి  క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

ఏయే ఆహారాలను దూరం పెట్టాలి:

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే ఆహార నియమాలను పాటించడం చాలా ముఖ్యం. షుగర్ జ్యూస్, అధిక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, వైట్ రైస్, రొట్టెలు, పాస్తా, రుచిగల పెరుగు, తియ్యటి తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ మొదలైనవి తినడం మానుకోవాలి. శరీరానికి పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు అందివ్వాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ముఖ్యమైన పోషకాలను కూడా అందించే ఆహారాలను తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..