AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water: పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు.. అధిక బరువుతో పాటు ఆ సమస్యలు పరార్‌

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం ఎంతో మేలు. తెల్లవారుజామున నిద్రలేచి ఖాళీ కడుపుతో నీళ్లు తాగే వారి శరీరంలోని విషతుల్యపదార్థాలన్నీ బయటకు సులువుగా పోతాయి.

Drinking Water: పరగడుపున నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు.. అధిక బరువుతో పాటు ఆ సమస్యలు పరార్‌
Drinking Water
Basha Shek
|

Updated on: Nov 21, 2022 | 7:15 AM

Share

నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తారు. సరైన మోతాదులో నీరు తాగకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీ రోజును ఒక గ్లాసు నీటితో ప్రారంభించాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గించుకోవాలనుకునేవారు ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం ఎంతో మేలు. తెల్లవారుజామున నిద్రలేచి ఖాళీ కడుపుతో నీళ్లు తాగే వారి శరీరంలోని విషతుల్యపదార్థాలన్నీ బయటకు సులువుగా పోతాయి. దీంతో రక్తం శుభ్రంగా మారుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ఉదయాన్నే ఓ గ్లాసు నీళ్లు తాగడం దినచర్యలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. మరి దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి.

కిడ్నీలో రాళ్లకు చెక్‌..

ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల కూడా రాళ్ల సమస్య తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఈ పద్ధతిని తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. అంతే కాకుండా ఉదయం పూట నీళ్లు తాగడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు మొదలైనవి దరిచేరవు.

చర్మం మెరవాలంటే..

మీ చర్మం మిలమిలా మెరిసిపోవాలంటే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగాలి. ఇది మీ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కొత్త చర్మ కణాలు ఏర్పడి ముఖంపై ముడతలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ఉదర సమస్యలు దూరం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల శరీరం బాగా శుభ్రపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు దూరం అవుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న రోగులు ప్రతిరోజూ ఉదయం నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగడం వల్ల పేగుల్లో పేరుకుపోయిన విషుతుల్య పదార్థాలు సులభంగా బయటకు పోతాయి. దీని వల్ల పొట్ట పూర్తిగా శుభ్రమవుతుంది.

నోట్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, మరిన్ని వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..