Heart Strokes: కరోనా వ్యాక్సిన్‌లకు గుండెపోటుకు సంబంధం ఉందా? పరిశోధకులు ఏం చెప్పారు?

New Delhi: కరోనా వదిలినా దాని ప్రభావం మాత్రం వదలడం లేదు. కరోనా అనంతరం గుండె జబ్బుల కారణంగా ఎంతోమంది యువకులు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి మరణాలు ఎన్నో నమోదయ్యాయి. అయితే, మరణాలన్నింటికీ కోవిడ్-19 సమయంలో తీసుకున్న టీకాలే కారణం అని ఒక రూమర్ స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని జిబి పంత్ ఆసుపత్రిలో..

Heart Strokes: కరోనా వ్యాక్సిన్‌లకు గుండెపోటుకు సంబంధం ఉందా? పరిశోధకులు ఏం చెప్పారు?
Heart

Updated on: Sep 07, 2023 | 1:07 AM

New Delhi: కరోనా వదిలినా దాని ప్రభావం మాత్రం వదలడం లేదు. కరోనా అనంతరం గుండె జబ్బుల కారణంగా ఎంతోమంది యువకులు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి మరణాలు ఎన్నో నమోదయ్యాయి. అయితే, మరణాలన్నింటికీ కోవిడ్-19 సమయంలో తీసుకున్న టీకాలే కారణం అని ఒక రూమర్ స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని జిబి పంత్ ఆసుపత్రిలో.. కరోనా తర్వాత అకస్మాత్తుగా గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడిపై అధ్యయనం చేశారు వైద్య నిపుణులు. మరి ఇతని మరణానికి కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్‌లే కారణం అయ్యాయా? ఈ ఆకస్మిక మరణాల వెనుక ఉన్న కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

జిబి పంత్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుల ప్రకారం.. కోవిడ్-19 వ్యాక్సిన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (AMI) తర్వాత 30 రోజులు, 6 నెలలలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ అధ్యయనం పెద్ద సంఖ్యలో AMI రోగులపై నిర్వహించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ సురక్షితమే కాదు, స్వల్పకాలిక మరణాలను నివారించడంలో కూడా సురక్షితమైనదని వీరి అధ్యయనం స్పష్టం చేసింది.

పరిశోధన బృందం ఆగస్టు 2021, ఆగస్టు 2022 మధ్య GB పంత్ హాస్పిటల్‌లో చేరిన 1,578 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులను అధ్యయనం చేసింది. మొత్తం రోగులలో, 69 మంది టీకాలు పొందారు. 31 శాతం మంది రోగులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదు. టీకాలు వేసిన వారిలో 96 మంది రోగులు రెండు వ్యాక్సిన్‌లను తీసుకున్నారు. 4 శాతం మంది ఒక టీకాను మాత్రమే పొందారు. వారిలో 92.3 శాతం మంది పూణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్ వ్యాక్సిన్‌ను 7.7 శాతం మంది రోగులు తీసుకున్నారు.

ఇతర అంశాలు కూడా మరణానికి కారణాలు..

టీకా, గుండెపోటు మధ్య ఎటువంటి సంబంధాన్ని పరిశోధన చూపించలేదు. టీకా తీసుకున్న మొదటి 30 రోజులలో కేవలం రెండు శాతం గుండెపోటులు మాత్రమే సంభవించాయి. టీకా తీసుకున్న 90-270 రోజుల తర్వాత చాలా గుండెపోట్లు సంభవిస్తాయి. 1,578 మంది గుండెపోటు రోగులలో, 13 శాతం మంది సగటున 30 రోజులలోపు మరణించారు. వారిలో 58 శాతం మందికి టీకాలు వేశారు. 42 శాతం మంది టీకాలు వేయలేదు. ఈ రోగులు వారి ముందుగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వ్యాక్సిన్ పొందిన 30 రోజులలోపు చనిపోయే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంది. పెరుగుతున్న వయస్సు, మధుమేహం, ధూమపానం 30-రోజుల మరణాలతో గణనీయంగా సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

ICMR పరిశోధనలు..

75 మంది రోగులు 30 రోజులు, 6 నెలల మధ్య మరణించారు. వారిలో 43.7 శాతం మంది టీకాలు వేసుకున్నారు. కానీ ఇతర వ్యాధులతో పోలిస్తే, వ్యాక్సినేషన్ వల్ల మరణించే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ICMR కూడా కోవిడ్-19 మహమ్మారి తర్వాత యువతలో ఆకస్మిక గుండె మరణాల గురించి ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us