Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Side Effects: ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉందా..? పెను ప్రమాదం ముంచుకొస్తున్నట్లే.. ఎందుకంటే..

ప్రస్తుత కాలంలో కిడ్నీ స్టోన్ సమస్య వయసు పెరిగే వారినే కాదు, యువతను కూడా పట్టి పీడిస్తోంది. దీని లక్షణాలు త్వరగా అర్థం కావు. రాయి పరిమాణం పెరుగుతున్న కొద్ది.. శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.

Salt Side Effects: ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉందా..? పెను ప్రమాదం ముంచుకొస్తున్నట్లే.. ఎందుకంటే..
Salt
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 24, 2023 | 2:01 PM

ప్రస్తుత కాలంలో కిడ్నీ స్టోన్ సమస్య వయసు పెరిగే వారినే కాదు, యువతను కూడా పట్టి పీడిస్తోంది. దీని లక్షణాలు త్వరగా అర్థం కావు. రాయి పరిమాణం పెరుగుతున్న కొద్ది.. శరీరంలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. కడపులో, వీపు భాగన తీవ్ర నొప్పి, మూత్రం విసర్జన వేళ నొప్పి, మంట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంది. తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు కాకుండా ఉప్పు ఎక్కువ తినడం కూడా కిడ్నీ స్టోన్ సమస్యలను కలిగిస్తుంది. మీరు కూడా ఉప్పును ఎక్కువగా తింటుంటే.. ఇప్పుడే మానేయడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చిట్కాల ద్వారా.. కిడ్నీ స్టోన్ సమస్య నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్లు రావడానికి ఇవి కూడా కారణాలు..

కిడ్నీ స్టోన్ సమస్య ఎలా వస్తుందంటే.. కడుపులో కరిగిన ఖనిజాలు కిడ్నీలో పేరుకుపోయి శరీరం నుంచి బయటకు రాలేనప్పుడు, అది రాయిగా మారుతుంది. మెడికల్ హిస్టరీ, ఊబకాయం, మధుమేహం, హై బీపీ, యూరిక్ యాసిడ్ వంటి సమస్యల వల్ల కూడా కిడ్నీ స్టోన్ రావచ్చు. దీనికి కారణం ఏదైనా కావచ్చు.. సకాలంలో, సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

కిడ్నీలో రాళ్లను నివారించడానికి 5 మార్గాలు..

  1. ఉప్పు ఎక్కువగా ఉపయోగించవద్దు: హార్వర్డ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం.. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు తినడం వల్ల మూత్రంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మనం ఒక రోజులో 2300 mg కంటే ఎక్కువ ఉప్పును ఉపయోగించకూడదు. అయితే 1500 mg ఉప్పు మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారికి సరైనది.
  2. ఎక్కువ నీరు తాగడం మంచిది: ఈ సమస్యను నివారించడానికి, ప్రతిరోజూ పుష్కలంగా నీరు తాగాలి. దీని వల్ల కిడ్నీలో పేరుకుపోయిన అదనపు ఖనిజాలు బయటకు వస్తాయి. నిమ్మకాయ లేదా ఏదైనా పుల్లని నీళ్లలో కలుపుకుని ఆ నీటిని తాగితే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా దూరమవుతుంది. రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
  3. కాల్షియం : కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మీకు కిడ్నీ స్టోన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.. పాలు, పెరుగు, పనీర్, సోయాబీన్, బాదం, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మీ మూత్రంలో కాల్షియం పేరుకుపోయే అవకాశాలు తగ్గుతాయి. దీని వల్ల రాళ్ల ప్రమాదం తగ్గుతుంది.
  4. యూరిక్ యాసిడ్: రెడ్ మీట్, చికెన్, గుడ్డు, సీఫుడ్‌లను ఎక్కువగా ఉపయోగించవద్దు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. నాన్ వెజ్‌కి బదులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.
  5. చాక్లెట్లు తినవద్దు: చాక్లెట్, టీ, వాల్‌నట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ విషయాల నుండి దూరంగా ఉండాలి సాధ్యమైనంత మేరకు ఆరోగ్యకరమైన వాటిని తినండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..