AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Patients: మధుమేహం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రమాదమే..!

Diabetic Patients: ఈ రోజుల్లో మధుమేహం అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తోంది. జీవనశైలి, ఆహారపు (Food) అలవాట్ల కారణంగా ఇది చాలా మందిని వెంటాడుతోంది...

Diabetic Patients: మధుమేహం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రమాదమే..!
Subhash Goud
|

Updated on: Apr 22, 2022 | 4:50 PM

Share

Diabetic Patients: ఈ రోజుల్లో మధుమేహం అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తోంది. జీవనశైలి, ఆహారపు (Food) అలవాట్ల కారణంగా ఇది చాలా మందిని వెంటాడుతోంది. నిజానికి డయాబెటిక్ రోగుల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఏ రోగికైనా మధుమేహం ఎక్కువ కాలం ఉంటే దాని ప్రభావం శరీరంలోని అనేక భాగాలపై పడుతుంది. మధుమేహం వచ్చిన తరువాత మనిషి ఆహార నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం. డయాబెటిక్ పేషెంట్లకు కిడ్నీ-కంటి సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆహారంపై సరైన శ్రద్ధ వహిస్తే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. షుగర్ పేషెంట్లు ఏయే ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలో తెలుసుకుందాం.

చిలగడదుంప:

బీటా కెరోటిన్ చిలగడదుంపలో ఉంటుంది. దీని కారణంగా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. చిలగడదుంపలో కార్బోహైడ్రేట్ల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగికి హానికరం.

ఆకుపచ్చ బటానీలు:

మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి బఠానీలను ఎక్కువగా తినకూడదు. కార్బోహైడ్రేట్ల పరిమాణం పచ్చి బఠానీలలో కూడా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది.

మొక్కజొన్న:

చాలా మంది మొక్కజొన్న తీసుకుంటారు. కానీ డయాబెటిక్ రోగులు అస్సలు తినకూడదు. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు అధిక మొత్తంలో, ఫైబర్ తక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడానికి కారణమవుతుంది.

ఫాస్ట్ ఫుడ్:

డయాబెటిక్ పేషెంట్ పొరపాటున కూడా ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. బర్గర్లు, పిజ్జా, వేయించిన పదార్థాలు రోగులకు చాలా హానికరం. ఫాస్ట్ ఫుడ్‌లో కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇది రోగికి హానికరం.

పిండి కూరగాయలు:

డయాబెటిక్ పేషెంట్లు కూడా కొన్ని కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. లేదా అస్సలు చేయకూడదు. కొన్ని కూరగాయలు బఠానీలు, మొక్కజొన్న మొదలైన పిండి పదార్ధాలు. వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. ఇలాంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది.

(నోట్‌: ఇందులోనే అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Scientific Reason: పిల్లలు రెండు తలలు, మూడు చేతులు, 6 వేళ్లతో పుట్టడానికి కారణం ఏమిటి! శాస్త్రీయ కారణాలు ఏమిటి?

Bone Health: కీళ్ల నొప్పితో బాధపడుతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే మీ ఎముకలు పుష్టిగా..