Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగితే మస్తు ఎనర్జీ ఉంటుంది.. నీరసం అనేదే ఉండదు..!

పసుపు మనం వంటల్లో వాడే సాధారణ పదార్థం. కానీ దీన్ని నీటితో కలిపి తాగితే శరీరానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరం లోపలికి శుభ్రత వస్తుంది. ఇది సహజంగా వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది.

ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగితే మస్తు ఎనర్జీ ఉంటుంది.. నీరసం అనేదే ఉండదు..!
Turmeric Water Health Benefits
Follow us
Prashanthi V

|

Updated on: May 18, 2025 | 8:53 PM

పూర్వకాలంలో పెద్దలు నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేసే వారు. వారి దీర్ఘాయుష్షుకు, ఆరోగ్యానికి ఇది ఒక కారణం. రాగిలోని ఖనిజాలు నీటిలో కరిగిపోవడం వల్ల ఆ నీరు తాగితే శరీరం శక్తిని పొందుతుంది. అంతేకాకుండా ఇది సహజంగా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలో వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలపై ప్రభావితం చూపుతుంది. అలాగే రాగిలో ఉండే గుణాలు శరీరంలోని జీవకణాలకు అవసరమైన శక్తిని ఇస్తాయి. ఈ రెండు కలిస్తే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

పసుపులో ఉండే పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇది చదువుకునే పిల్లలకు కూడా మేలు చేస్తుంది.

రాగి నీరు పేగుల పని తీరును మెరుగుపరుస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. పొట్టలో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

పసుపు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇది లోపల నుంచి రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. రాగిలో ఉండే ఖనిజాలు చర్మానికి కొత్త కణాలను తయారు చేయడంలో సహాయపడతాయి.

శరీరానికి అవసరమైన ఐరన్ ను గ్రహించడంలో రాగి నీరు ఉపయోగపడుతుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రత్యేకించి పిల్లలు, గర్భిణులు దీని వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

రోజూ ఉదయం ఒక గ్లాసు నీటిని రాగి సీసాలో నుంచి తీసుకొని అందులో చిటికెడు పసుపు కలిపి తాగాలి. ఇది శరీరానికి సహజ శుద్ధిని కలిగిస్తుంది. రోజూ అలవాటుగా మార్చుకుంటే శరీరానికి చాలా మేలు జరుగుతుంది.

ఈ అలవాటుతో ఎక్కువ ఖర్చు లేకుండానే ఆరోగ్యంగా ఉండొచ్చు. మందులపై ఆధారపడాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇది సహజంగా శరీర శ్రేయస్సును పెంచుతుంది. ఈ విధంగా రాగి సీసాలో నిల్వ చేసిన పసుపు నీరు తాగడం వలన శరీరానికి విశేష ప్రయోజనాలు లభిస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)