AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ఈ రెండు లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు.. క్యాన్సర్ కావొచ్చు.. బీకేర్‌ఫుల్

ఏటా క్యాన్సర్ మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం భారతదేశంలో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలను గుర్తించకపోవడం ఇప్పటికీ పెద్ద సమస్యగానే ఉంది.. క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ విషయాలను తెలుసుకోండి..

శరీరంలో ఈ రెండు లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు.. క్యాన్సర్ కావొచ్చు.. బీకేర్‌ఫుల్
Cancer
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2025 | 5:14 PM

Share

భారతదేశంలో క్యాన్సర్ మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం దేశంలో 14 లక్షలకు పైగా ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి. 2025 నాటికి దేశంలో క్యాన్సర్ కేసులు 12.8 శాతం పెరిగే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంచనా వేసింది. ప్రస్తుతం భారతదేశంలో, ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి వారి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతారు..

క్యాన్సర్ విషయంలో అతి పెద్ద ఆందోళన ఏమిటంటే.. ప్రజలకు దాని లక్షణాల గురించి తెలియకపోవడం. క్యాన్సర్‌కు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ లక్షణాలపై శ్రద్ధ వహించడం, సకాలంలో చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చు. అటువంటి పరిస్థితిలో.. ఆరోగ్య నిపుణులు క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాల గురించి వివరించారు.

వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఢిల్లీలోని యాక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ జెబి శర్మ మాట్లాడుతూ.. ఈ వ్యాధి ప్రమాదకరమైనది.. ప్రాణాంతకమైనది.. అయితే సకాలంలో గుర్తిస్తే దీనికి చికిత్స చేయవచ్చని అన్నారు. ప్రజలు ఈ వ్యాధి గురించి అర్థం చేసుకోవాలి. క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి.. దీనిలో శరీర కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభమై.. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం ప్రారంభిస్తాయి. శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్, కడుపు క్యాన్సర్ కేసులు వేగంగా పెరిగాయి. మనం వాటి లక్షణాల గురించి మాట్లాడుకుంటే.. అవి వివిధ రకాలుగా ఉండవచ్చు. కానీ కొన్ని లక్షణాలను విస్మరించవద్దని సూచించారు.

క్యాన్సర్ లక్షణాలు..

మీ ఆహారం లేదా వ్యాయామంలో ఎటువంటి మార్పు లేకుండా మీ బరువు వేగంగా తగ్గుతుంటే.. అది క్యాన్సర్ కు సంబంధించి ప్రధాన లక్షణం. ఇది కాకుండా, మీ శరీరంలో రక్తం కొరత ఉంటే దానిని విస్మరించవద్దు. ఇవి క్యాన్సర్ రెండు సాధారణ లక్షణాలు.. ఇవి ఏ రకమైన క్యాన్సర్‌కైనా సంకేతం కావచ్చు. వీటితో పాటు, కడుపు నొప్పి, రొమ్ములో గడ్డ లేదా వాపును కూడా విస్మరించకూడదు.

నేటి కాలంలో ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం, పొగాకు వినియోగం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్ శర్మ అంటున్నారు. అందువల్ల, క్యాన్సర్ లక్షణాలపై శ్రద్ధ వహించడం, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం..

క్యాన్సర్ చికిత్స..

ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో కొత్త సాంకేతికతలు వస్తున్నాయి. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీతో పాటు, రోగులకు ఇప్పుడు ఇమ్యునోథెరపీ, హార్మోన్ థెరపీ కూడా చికిత్స అందిస్తున్నారు. రోగి పరిస్థితిని బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us