ముచ్చటగా మూడో సినిమాను ప్రకటించిన నితిన్!

|

Jun 24, 2019 | 12:42 PM

యంగ్ హీరో నితిన్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ అట్లూరితో ‘భీష్మ’ అనే సినిమా ఇటీవలే మొదలుపెట్టిన ఆయన.. నిన్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమాను లాంచ్ చేశాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొద్దిసేపటి క్రితం మరో కొత్త సినిమాను ప్రకటించాడు నితిన్. ‘మజ్ను’తో నిరాశపరిచిన దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్‌దే’ అనే సినిమాను త్వరలోనే సెట్స్ […]

ముచ్చటగా మూడో సినిమాను ప్రకటించిన నితిన్!
Follow us on

యంగ్ హీరో నితిన్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ అట్లూరితో ‘భీష్మ’ అనే సినిమా ఇటీవలే మొదలుపెట్టిన ఆయన.. నిన్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమాను లాంచ్ చేశాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొద్దిసేపటి క్రితం మరో కొత్త సినిమాను ప్రకటించాడు నితిన్.

‘మజ్ను’తో నిరాశపరిచిన దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్‌దే’ అనే సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఇది పూర్తిస్థాయి లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుందని సమాచారం. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.