త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటి విద్యుల్లేఖ

ప్రముఖ నటి విద్యుల్లేఖ రామన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. సంజయ్‌ అనే వ్యక్తితో గత నెలలో విద్యుల్లేఖ రోకా కార్యక్రమం జరిగింది

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటి విద్యుల్లేఖ

Updated on: Sep 01, 2020 | 12:21 PM

Vidyullekha Raman Roka: ప్రముఖ నటి విద్యుల్లేఖ రామన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. సంజయ్‌ అనే వ్యక్తితో గత నెలలో విద్యుల్లేఖ రోకా కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను విద్యుల్లేఖ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆగష్టు 26వ తేదీన మా ఇద్దరి రోకా కార్యక్రమం కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. మాస్క్‌లు పెట్టుకున్నాము. ఫొటోల కోసం తీసేశాము. ఎవరూ అడగక ముందే చెప్తున్నా. మా ఇద్దరికి అభినందనలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ఇక విద్యుల్లేఖకు వరుణ్ తేజ్, ధన్య బాలకృష్ణన్, రాశిఖన్నా, పాయల్‌, నభా నటేష్ తదితరులు అభినందనలు తెలిపారు.

కాగా ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి పేరును సాధించుకున్నారు. ఇక విద్యుల్లేఖను పెళ్లాడబోతున్న సంజయ్‌కి డైటీషియన్‌గా మంచి పేరుంది. అలాగే సంజయ్‌ బిజినెస్‌మ్యాన్ అని సమాచారం. ఇక త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి తరువాత విద్యుల్లేఖ సినిమాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Read More:

కిమ్ సోదరి ఎక్కడ.. నెలరోజులుగా కనిపించని జాంగ్!

అవును మేమిద్దరం విడిపోయాం: సింగర్ నోయల్‌

Loading...
Unable to load recommendations.
Follow Us