కిమ్ సోదరి ఎక్కడ.. నెలరోజులుగా కనిపించని జాంగ్!
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా తరువాత బాగా వినిపిస్తోన్న పేరు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆరోగ్యం క్షీణించిందని
Kim Jong Un sister: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా తరువాత బాగా వినిపిస్తోన్న పేరు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆరోగ్యం క్షీణించిందని, ఆయన కోమాలోకి వెళ్లారని, ఎప్పుడైనా మరణించే అవకాశం ఉందంటూ పలు వదంతులు వచ్చాయి. అంతేనా కిమ్ అనారోగ్యం నేపథ్యంలో ఆయన సోదరి కిమ్ యో జాంగ్కి అధికార పగ్గాలు ఇచ్చారన్న టాక్ నడిచింది. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ ఆ మధ్యన పూర్తి ఆరోగ్యంతో దర్శనమిచ్చాడు కిమ్. కానీ కిమ్ అదృశ్యం సమయంలో యాక్టివ్గా ఉన్న ఆయన సోదరి జాంగ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నెలరోజులుగా అధికారిక కార్యక్రమాల్లో ఆమె కనిపించడం లేదు. ఈ క్రమంలో జాంగ్ ఎక్కడికి వెళ్లిందన్న చర్చలు మొదలయ్యాయి.
అయితే కిమ్ అనారోగ్యం నేపథ్యంలో ఉత్తర కొరియా విషయాల్లో జాంగ్ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా దాయాది దేశం దక్షిణ కొరియాపై ఆమె విరుచుకుపడ్డారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని, ఉభయ కొరియాల మధ్య చర్చలకు వేదికగా ఉన్న అనుసంధాన కార్యాలయాన్ని పేల్చేందుకు కూడా సిద్ధమని ఆమె ఆదేశాలు చేశారు. ఇక అమెరికాతోనూ దౌత్య పరమైన వ్యవహరాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఒకానొక సమయంలో కిమ్ కంటే ఎక్కువ పేరునే సంపాదించుకున్నారు జాంగ్. అయితే ఇలా జాంగ్ పాపులారిటీ పెరగడం కిమ్కి నచ్చలేదట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిమ్.. ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో వెనక్కి తగ్గారట. ఇక ఆమెకు కట్టబెట్టిన అధికారాల్లోనూ కొన్నింటికి కత్తెర వేశారట. ఈ నేపథ్యంలోనే అధికార వర్కర్స్ పార్టీలో పొలిట్బ్యూరో సభ్యురాలు అయినప్పటికీ.. గత నెలరోజులుగా తాను పాల్గొనాల్సిన సమావేశాలకు జాంగ్ హాజరుకావడం లేదని సమాచారం. అయితే అధికారం కోసం కిమ్ ఏం చేయడానికైనా సిద్ధపడుతాడని ఇప్పటికే పుకార్లు ఉండగా.. ఇప్పుడు జాంగ్ అదృశ్యంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.
Read More: