‘మజిలీ’ చీఫ్ గెస్ట్‌గా వెంకీ

| Edited By: Ravi Kiran

Mar 27, 2019 | 5:04 PM

హైదరాబాద్‌: అక్కినేని యువజంట నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై బజ్‌ను పెంచాయి. కాగా ఈ నెల 30న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా చేయబోతుంది మూవీ యూనిట్. ఈ వేడుకకు చైతూ  మేనమామ విక్టరీ వెంకటేశ్‌ ముఖ్య  అతిథిగా రాబోతున్నారు. ‘నిన్ను కోరి’ మూవీతో మంచి సెన్సిబుల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.  ‘మజిలీ’ […]

మజిలీ చీఫ్ గెస్ట్‌గా వెంకీ
Follow us on

హైదరాబాద్‌: అక్కినేని యువజంట నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై బజ్‌ను పెంచాయి. కాగా ఈ నెల 30న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా చేయబోతుంది మూవీ యూనిట్. ఈ వేడుకకు చైతూ  మేనమామ విక్టరీ వెంకటేశ్‌ ముఖ్య  అతిథిగా రాబోతున్నారు. ‘నిన్ను కోరి’ మూవీతో మంచి సెన్సిబుల్ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.  ‘మజిలీ’ చిత్రంలో దివ్యాంశా కౌశిక్‌ మరో కథానాయికగా నటించారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యభర్తల అనుబంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలస్తోంది.  గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి అక్కినేని కపుల్ ఆన్ స్రీన్‌ పెర్ఫామెన్స్‌తో..ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందో, లేదోొ చూడాలి. కాగా వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.