Dongalunnaru Jagratha: మరో థ్రిల్లర్ కథతో రానున్న శ్రీ సింహ.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ పూర్తి
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా చేస్తున్న విషయం తెలిసిందే. మత్తువదలరా సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో.. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్సెలో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు. సెట్ను సిద్ధం చేయడంతో పాటు, కస్టమ్-మేడ్ కారును కూడా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో చివర్లో శ్రీ సింహ కోడూరి ఎంట్రీ ఇచ్చారు. 72 మంది టీంతో 342 గంటల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారని మేకర్స్ వెల్లడించారు. అలాగే సింగల్ లొకేషన్ లో షూట్ చేశారు. సినిమా కథాంశానికి వస్తే.. ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తీరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.




