AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ స్టార్ హీరో ఏడాదికి రూ. 5 కోట్లు పంపించేవాడు.. సీక్రెట్ చెప్పిన నటుడు

నటుడు శోభన్ బాబు క్రమశిక్షణ, ఆయన జీవితంలోని పలు సంఘటన గురించి రచయిత తోటపల్లి మధు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన రామకృష్ణ మిషన్‌కు ప్రతి సంవత్సరం 5 కోట్లు విరాళంగా ఇచ్చేవారని, అభిమానులకు ఆర్థికంగా సహాయపడేవారని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..

Tollywood: ఆ స్టార్ హీరో ఏడాదికి రూ. 5 కోట్లు పంపించేవాడు.. సీక్రెట్ చెప్పిన నటుడు
Thotapalli Madhu
Ravi Kiran
|

Updated on: Feb 21, 2026 | 1:48 PM

Share

రచయిత తోటపల్లి మధు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. లెజెండరీ నటుడు శోభన్ బాబు జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలను తెలిపారు. శోభన్ బాబు క్రమశిక్షణ గల వ్యక్తి అని, ఆయన జీవితం ఎప్పుడూ ఎవరికీ బయటకు తెలియకుండానే సాగిందని మధు పేర్కొన్నారు.

శోభన్ బాబు ప్రజాదరణ, అభిమానుల పట్ల ఆయనకున్న బాధ్యత అసాధారణమైనది. ఆయన నటన మానేసిన 13 ఏళ్ల తర్వాత మరణించినా, మద్రాసు, వైజాగ్, విజయవాడ, తెనాలి, గుంటూరు, చీరాల, ఒంగోలు వంటి నగరాల నుంచి వేలాది మంది అభిమానులు వర్షంలో సైతం ఆయనకు నివాళులర్పించడానికి తరలివచ్చారని మధు గుర్తు చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం శోభన్ బాబు తన అభిమానుల జీవితాలను స్థిరపరచడానికి సహాయపడడమే. ఆయన అభిమానులను వారి చదువు, ఆదాయం గురించి అడిగి, వారికి ఆర్థిక సహాయం అందించేవారని మధు వివరించారు. ఒక అభిమాని ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవాలనుకుంటే, లక్ష రూపాయలు సహాయం చేసిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. శోభన్ బాబు అద్భుతమైన ఆర్థిక దక్షతను కలిగి ఉండేవారని, హీరోగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, భూములపై బాగా పెట్టుబడులు పెట్టారని మధు పేర్కొన్నారు.

శోభన్ బాబు గొప్ప దాత అని, రామకృష్ణ మిషన్‌కు ప్రతి సంవత్సరం 5 కోట్లు విరాళంగా ఇచ్చేవారని మధు వెల్లడించారు. అంతేకాకుండా, 1971 నుంచి 1977 మధ్య కాలంలో జయలలితతో ఆయనకు మంచి సంబంధం ఉందని, ఆ సమయంలో MGR స్విస్ బ్యాంకులో దాచిన సుమారు 3000 కోట్ల రూపాయలను జయలలిత కనుగొని శోభన్ బాబుతో పంచుకున్నారని, ఆ డబ్బును స్థలాలపై పెట్టుబడిగా పెట్టి, దానిని జయలలితకు, ఆయనకు సగం చొప్పున పంచుకున్నారని తోటపల్లి మధు వివరించారు.

Follow Us