
నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య. అంతే కాదు ఇటీవలి కాలంలో బాలయ్య చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. థియేటర్స్ దగ్గర బాలయ్య సినిమాల సందడి మాములుగా ఉండదు.. అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. దర్శకనిర్మాతలు కూడా బాలయ్యను అదే రేంజ్ లో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే..
ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య, గోపీచంద్ మలినేని కలిసి అభిమానులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి ప్రీ లుక్ పోస్టర్స్ ను కూడా విడుదల చేశారు. అలాగే బాలయ్యకు జోడీగా నయనతారను కూడా ఫిక్స్ చేశారు. బాలయ్య, నయనతార కలిసి గతంలో శ్రీరామ రాజ్యం, సింహ, జై సింహ సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి బాలయ్యతో నయన్ జోడీ కట్టనుంది అని అనౌన్స్ చేశారు.. కానీ
ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చిందని తెలుస్తుంది. బాలయ్య కొత్త సినిమాలో నయనతార ప్లేస్ లోకి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాజల్ అగర్వాల్ బాలయ్యతో గతంలో భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె కొన్ని పాత్రలకే పరిమితం అయ్యింది. ఇక ఇప్పుడు బాలయ్య, గోపీచంద్ సినిమాలో కాజల్ పాత్ర ఫుల్ లెన్త్ ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.