ప్రముఖ నటి విజయశాంతి.. చాలా కాలం తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి హీరో మహేశ్బాబు ఇంట్రోను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విజయశాంతి 13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్నారంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘ఇట్స్ మేకప్ టైమ్ ఫర్ విజయశాంతి గారు’ అంటూ అనిల్ పేర్కొన్నాడు. ఈ 13 ఏళ్లలో ఆమె ఏ మాత్రం మారలేదు. అదే క్రమశిక్షణ, అదే వైఖరి, అదే డైనమిజమ్ అంటూ.. విజయశాంతి రీ ఎంట్రీకి స్వాగతం తెలిపాడు.
అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ‘వెల్కమ్ మేడమ్’ అంటూ అనిల్ పోస్ట్ను రీట్వీట్ చేశాడు. ఒకప్పుడు లేడీ సూపర్స్టార్గా అభిమానులను అలరించిన విజయశాంతి గత కొన్నేళ్లుగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. కాగా, ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
[svt-event date=”12/08/2019,5:38PM” class=”svt-cd-green” ]
After 13 years.. It’s make up time for Vijayashanthi garu.. Nothing has ever changed in all these 13 years. Same discipline, same attitude and same dynamism. Welcome on-board @vijayashanthi_m garu ? #SarileruNeekevvaru pic.twitter.com/xM69EgjP9c
— Anil Ravipudi (@AnilRavipudi) August 12, 2019