
ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మిక మందన్న, కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు తుమ్మన్ పేటకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లైన తర్వాత తొలిసారి సొంతూరుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు విజయ్ దేవరకొండ. దీంతో తుమ్మన్ పేట గ్రామస్థులు విజయ్ కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఉన్న తమ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు విజయ్, రష్మిక. అలాగే స్థానిక ప్రజలందరికీ విజయ్ కుటుంబ సభ్యులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. అనంతరం రష్మిక, విజయ్ ఇద్దరూ అక్కడున్న ప్రజలతో మాట్లాడారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. “సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మన గ్రామానికి చాలా మంచి పనులు చేయాలని ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మాకు సొంత ఇళ్లు, పొలమూ ఉన్నాయి. ఇక నుంచి తరుచుగా మన గ్రామానికి వస్తాను. అచ్చం పేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున స్కాలర్ షిప్స్ అందిస్తాం” అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
మరోవైపు మార్చి 4న హైదరాబాద్ లో రష్మిక, విజయ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సినీప్రముఖులు, రాజకీయ నాయకులు హజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే వీరిద్దరి కలిసి రణబాలి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఏందయ్యా సామీ సాంగ్ వైరలవుతుంది.
anna🫶🏻🥹
Ma Bangaru Konda🫂#VijayDeverakonda #virosh pic.twitter.com/I8hE5pIpbP— VIZAG VDFA📍 (@VIZAGVDFA) March 2, 2026
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..