96 Sequel: విజయ్ సేతుపతి, త్రిషల క్లాసిక్ లవ్ స్టోరీ ’96’ సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

|

Sep 12, 2024 | 7:57 PM

2018 అక్టోబర్ లో విడుదలైన '96' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు కలుసుకున్నప్పుడు ఎదురయ్యే ఎమోషనల్ ఈవెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించారు. మాజీ ప్రేమికుల పాత్రలో త్రిష కృష్ణన్, విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు

96 Sequel: విజయ్ సేతుపతి, త్రిషల క్లాసిక్ లవ్ స్టోరీ 96 సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
96 Movie
Follow us on

2018 అక్టోబర్ లో విడుదలైన ’96’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు మాజీ ప్రేమికులు కలుసుకున్నప్పుడు ఎదురయ్యే ఎమోషనల్ ఈవెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించారు. మాజీ ప్రేమికుల పాత్రలో త్రిష కృష్ణన్, విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. 96′ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.అంతేకాదు వివిధ భాషల్లోకి రీమేక్ కూడా అయ్యింది. ఇదే సినిమాను తెలుగులో జాను పేరిటా రీమేక్ చేయ‌గా.. ఇక్క‌డ కూడా మంచి విజ‌యం సాధించింది. ఇందులో శర్వానంద్ , సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ క్లాసిక్ లవ్ స్టోరీ సీక్వెల్ రాబోతోంది. దర్శకుడు ప్రేమ్ కుమార్ ’96’ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు.ఇది విన్న త్రిష కృష్ణన్, విజయ్ సేతుపతి అభిమానులు సంతోషిస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడీ సినిమా కొనసాగింపు ఎలా ఉంటుందోనని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

’96’ సినిమా విడుదలై సుమారు 6 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఎక్కడో ఒక చోట ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు ప్రేమ్ కుమార్ సినిమాపై ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని గమనించి కథను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దర్శకుడు ప్రేమ్ ఇప్పటికే ’96’ సీక్వెల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. ఇక విజయ్ సేతుపతి, త్రిష కృష్ణన్‌లను కలుసుకుని కథ చెప్పడమే మిగిలి ఉంది. ఆ ఇద్దరు ఆర్టిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కథ విన్న తర్వాత త్రిష, విజయ్ సేతుపతి ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

కాగా ప్రస్తుతం మేయల‌గ‌న్ (తెలుగులో స‌త్య సుంద‌రం) సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రేమ్ కుమార్. ఇందులో కోలీవుడ్ స్టార్ న‌టులు కార్తీ , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య- జ్యోతిక ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. రాజ్ కిర‌ణ్, శ్రీదేవి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

వారు ఎప్పుడంటే అప్పుడే సెట్స్ పైకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.