Nandamuri Taraka Ratna: తారకరత్న మృతికి సంతాపం తెలిపిన ప్రధాని, పలువురు సినీ ప్రముఖులు
23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించారు

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే తారకరత్న మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూశారు తారకరత్న.. 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించారు. మోకిల లోని ది కంట్రీ సైడ్ విల్లా కు చేరుకున్న తారక రత్న మృతదేహం. తారకరత్న మరణంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. పలువురు సినిమా తారలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తారకరత్న మృతి పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023
తారకరత్న అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. చాలా త్వరగా వెళ్లిపోయారు బ్రదర్… మీ కుటుంబానికి మనోధైర్యం కలిగించాలి అని భగవంతుడిని కోరుకుంటున్న అని అన్నారు మహేష్.
Shocked and deeply saddened by the untimely demise of #TarakaRatna. Gone way too soon brother… My thoughts and prayers are with the family and loved ones during this time of grief. ?
— Mahesh Babu (@urstrulyMahesh) February 18, 2023
అలాగే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ.. శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి..నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు పవన్ కళ్యాణ్.
శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RmKnZZaSvv
— JanaSena Party (@JanaSenaParty) February 18, 2023
Deeply saddened to learn of the tragic premature demise of #NandamuriTarakaRatna Such bright, talented, affectionate young man .. gone too soon! ? ? Heartfelt condolences to all the family members and fans! May his Soul Rest in Peace! శివైక్యం ?? pic.twitter.com/noNbOLKzfX
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2023




