Tollywood: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్.. అయినా అద్దె ఇంట్లోకి హీరోయిన్..

|

Aug 29, 2024 | 7:30 AM

బీచ్ కు ఎదురుగా ఉన్న ఈ బిల్డింగ్ లో హీరో అక్షయ్ కుమార్ అఫార్ట్మెంట్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం హృతిక్ ఉంటున్న ఇంటి అద్దె నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందట. నిజానికి ఈ ఇంట్లో హీరో వరుణ్ ధావన్ ఉండాలనుకున్నారు. కానీ డీల్ కుదరకపోవడంతో కుదరలేదు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ అదే ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అయ్యింది. ఇ

Tollywood: బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్.. అయినా అద్దె ఇంట్లోకి హీరోయిన్..
Actress
Follow us on

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న సినిమా స్త్రీ 2. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది శ్రద్ధా కపూర్. ఇందులో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి కీలకపాత్రలు పోషించారు. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు రికార్డ్ బద్దలుకొడుతుంది. అయితే ఓవైపు తన సినిమా కోట్లు కొల్లగొడుతుంటే.. మరోవైపు హీరోయిన్ మాత్రం అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అవుతుందట. అవును.. ఇప్పుడు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కొత్తిళ్లు వెతుక్కుంది. ముంబైలోని జుహు ప్రాంతంలో స్టార్ సెలబ్రెటీస్ ఉండే ఏరియాలోనే ఈ బ్యూటీ అద్దెకు ఉండనుందట. ప్రస్తుతం ఆ ఇంట్లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఉంటున్నారు. త్వరలోనే ఇదే ఇంట్లోకి శ్రద్ధా షిఫ్ట్ కానుంది.

బీచ్ కు ఎదురుగా ఉన్న ఈ బిల్డింగ్ లో హీరో అక్షయ్ కుమార్ అఫార్ట్మెంట్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం హృతిక్ ఉంటున్న ఇంటి అద్దె నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందట. నిజానికి ఈ ఇంట్లో హీరో వరుణ్ ధావన్ ఉండాలనుకున్నారు. కానీ డీల్ కుదరకపోవడంతో కుదరలేదు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ అదే ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే స్త్రీ 2 చిత్రంలో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ అతిథి పాత్రలలో నటించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో భేడియాగా సర్కటాతో ఫైట్, శ్రద్ధా కపూర్ తో రొమాన్స్ తో వరుణ్ ఆకట్టుకున్నాడు. అంటే.. వరుణ్ భేడియా మూవీ సీక్వెల్లో శ్రద్ధ రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం స్త్రీ 2 సినిమా దూసుకుపోతుంది. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుంది. 13 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఇండియాలోనే రూ.414 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. శ్రద్ధా ఇల్లు మారడానికి కారణం ఉంది. 1987లో శ్రద్ధా తండ్రి శక్తి కపూర్.. జుహూలోనే ఓ ఇంటిని కొన్నారు. ఇప్పుడు దానిని రీమోడలింగ్ చేయాలనుకుంటున్నారని.. అందుకే కొన్నాళ్లపాటు శ్రద్ధా వేరే ఇంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.