
తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివకార్తికేయన్ ఆ తర్వాత తన సినిమాలను తెలుగులోకి డబ్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈహీరోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. యాంకర్ గా బుల్లితెరపై సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించాడు. చివరిగా అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
కెరీర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శివకార్తికేయన్.. ఆ తర్వాత మెరీనా అనే సినిమాతో హీరోగా మారాడు. మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఇటీవలే మేజర్ ముకుంద్ జీవితకథతో తెరకెక్కిన అమరన్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ మూవీతో శివకార్తికేయన్, సాయి పల్లవి సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ఇప్పుడు మదరాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మదరాసి సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,టీజర్స్ , సాంగ్స్ తోపాటు ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియాట్ చేసింది. తాజాగా హైదరాబాద్ లో మదరాసి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకవేళ తాను సినిమాల్లోకి రాకుండా ఉండుంటే పోలీస్ అయ్యేవాడిని అని అన్నారు. తన తండ్రి పోలీస్ కాబట్టి తాను కూడా పోలీస్ అయ్యేవాడిని అని తెలిపాడు శివకార్తికేయన్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి