Sunitha: సింగర్ సునీత కుమార్తెను లేటెస్ట్‌గా చూశారా..? అమ్మను మించిన అందం మాత్రమే కాదు

|

Jun 30, 2024 | 3:06 PM

సింగర్ సునీత గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఈ వేళలో నీవు ఎం చేస్తూ ఉంటావో అని గులాబీ సినిమాలో ఆమె పాడిన మొదటి పాట ఇప్పటికీ ఓ క్లాసిక్. సునీత కేవలం సింగర్ మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా... ఇంతకీ సునీత కుమార్తెను మీరు ఎప్పుడైనా చూశారా...

Sunitha: సింగర్ సునీత కుమార్తెను లేటెస్ట్‌గా చూశారా..? అమ్మను మించిన అందం మాత్రమే కాదు
Singer Sunitha
Follow us on

సింగర్ సునీత గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుత గాత్రంతో శ్రోతలను సమ్మోహనపరచడంలో ఆమె ముందు ఉంటారు. ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమెకు దాసోహమయ్యాయి. కేవలం సింగర్ మాత్రమే కాదు.. తను ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. చాలామంది పేరు మోసిన హీరోయన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు.. చెప్తున్నారు. ఇక పాటల కార్యక్రమాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. యువ గాయనీగాయకులు మెంటర్‌గా మారారు. ఎంత కీర్తి ఆమెకు వచ్చినా.. సునీత అంటే తొలుతు గుర్తుకువచ్చేది గులాబీ చిత్రంలోని “ఈ వేళలో నీవు” సాంగ్. ఇండస్ట్రీలో ఆమెకు తొలి సాంగ్ కూడా ఇదే. ఆ తర్వాత ఆమె జర్నీ నాన్ స్టాప్‌గా సాగుతూనే ఉంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సునీత మొదటి భర్తతో చాలా ఏళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం.. ఆమె మ్యాంగో మీడియా గ్రూప్ ఎండీ రామ్‌ను ద్వితీయ వివాహం చేసుకున్నారు.

సునీతకు తొలి భర్తతో తనయుడు ఆకాష్, కుమార్తె శ్రేయ ఉననారు. సునీత కుమారుడు ఆకాష్ సర్కార్ నౌకరి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించాడు. త్వరలో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇకపోతే సునీత తనయ శ్రేయ.. కూడా తన అమ్మలాగే ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. ప్రజంట్ ఫారెన్‌లో ఉన్నత చదువులు చదువుతున్న శ్రేయ.. నాగ‌చైత‌న్య హీరోగా వచ్చిన స‌వ్య‌సాచి సినిమాలో టిక్ టిక్ టిక్ అనే పాట పాడింది. శ్రేయ గాత్రం కూడా అమేజింగ్ అంతే.. తన ఇన్ స్టాలో పేజీలు పలు సాంగ్స్ పాడుతూ వీడియోలు కూడా పోస్ట్ చస్తోంది. అమ్మ నుంచి అందాన్ని, అంతే వినసొంపైన గాత్రాన్ని పొందిన శ్రేయ.. మున్ముందు సింగర్‌గా రాణించడం పక్కా అనిపిస్తోంది. అయితే తను హీరోయిన్ అయితే ఎంకరేజ్ చేస్తామని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరిశ్రేయ మనసులో ఏముందో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.