సిద్ధూ ఈజ్ బ్యాక్, ‘మహాసముద్రం’ తో
ఆర్.ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం శర్వానంద్ తో ‘మహాసముద్రం’ సినిమా చేయబోతున్నారు.
ఆర్.ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం శర్వానంద్ తో ‘మహాసముద్రం’ సినిమా చేయబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ విలన్గా నటించనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ రూమర్స్ నిజమేనని చెప్తూ శుక్రవారం మూవీ యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘మహాసముద్రం’లో సిద్ధార్థ్ నటిస్తున్నట్టు అనౌన్స్ చేసింది.
‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఆట’, ‘చుక్కల్లో చంద్రుడు’ వంటి సినిమాలతో తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు సిద్దార్థ్. అయితే, ఆ తరవాత వరుస ప్లాపులు పలుకరించడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో పూర్తిగా తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే, అప్పుడప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆయన చివరిగా డబ్బింగ్ మూవీ ‘గృహం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు చాలా కాలం తరవాత ఒక తెలుగు సినిమాకు సైన్ చేశాడు. అజయ్ భూపతి రాసిన పవర్ఫుల్ పాత్ర నచ్చడంతో సిద్ధార్థ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. ‘మహాసముద్రం’ను నిర్మిస్తోంది.
He is an ocean of talent and returns back to Telugu Cinema..Welcoming @Actor_Siddharth on board for #Mahasamudram ? @ImSharwanand @DirAjayBhupathi @AKentsOfficial @AnilSunkara1 #SidIsBack
More interesting updates soon! ? pic.twitter.com/HKgzlrHZW0
— AK Entertainments (@AKentsOfficial) September 18, 2020
Also Read :