Skylab Movie : విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా సత్య దేవ్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా స్కైలాబ్. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ మూవీ ట్రైలర్ను నవంబర్ 1న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ ‘‘1979 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం అని అన్నారు. ఇక ఈ సినిమాలో ఆనంద్గా సత్యదేవ్, గౌరీగా నిత్యామీనన్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్ను ఇటీవలే విడుదల చేశారు. ఆర్టిసులు సహా అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారని దర్శకుడు అన్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్ను రికార్డ్ చేయించాం అన్నారు.నవంబర్ 1న ఈ సినిమా ట్రైలర్ను విడుదల క్సహేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమాను థియేటర్స్లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని దర్శకుడు విశ్వక్ ఖండేరావు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :