
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ అమ్మాయి.. ఇప్పుడు పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు, హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన సికందర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. మరోవైపు చేతినిండా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంటుంది. ఈరోజు ఈ అమ్మడు 29వ పుట్టినరోజు . ఈసందర్భంగా ఆమెకు అభిమానులు, సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే రష్మిక త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
తాజాగా సోషల్ మీడియాలో రష్మిక ఫస్ట్ అడిషన్ వీడియో చక్కర్లు కొడుతుంది. అందులో ఫస్ట్ డైలాగ్ చెప్పడానికి భయపడుతూ.. ఇబ్బంది పడుతూ కనిపించింది. ఈ వీడియో కిరిక్ పార్టీ సినిమా కోసం చేసిన అడిషన్ అని తెలుస్తోంది. రష్మిక మందన్న డిగ్రీ చదువుతున్నప్పుడే ‘కిరిక్ పార్టీ’ ఆఫర్ అందుకుంది. ఆమె మోడల్ కూడా, సాన్వి పాత్రకు ఎంపికైంది. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమా చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్ కాలేదు.
కిరిక్ పార్టీ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత పుష్ప మూవీతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో సత్తా చాటుతుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..