రష్మిక డైరెక్ట్గా చూసిన మొదటి హీరో ఎవరంటే !
రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. వరసగా అగ్ర హీరోల పక్కన ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందుకుంటూ దూసుకుపోతుంది.

రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. వరసగా అగ్ర హీరోల పక్కన ఛాన్సులు సంపాదిస్తూ, హిట్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగులోనూ సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. తన అందం, అభినయంతో తెలుగువారిని కట్టిపడేసింది. కాగా ఈ భామ తాను మొదటిసారి చూసిన స్టార్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చింది.
“ఓ స్టార్ ఎలా ఉంటారు? వాళ్ల లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? ఎలాంటి ఫుడ్ తింటారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని కోరికగా ఉండేది. పేపర్లు, టీవీల్లో నా అభిమాన తారల సంగతులు వచ్చినప్పుడు చాలా ఇంట్రస్ట్తో చూసేదాన్ని. షూటింగ్లు చూడాలని ఉండేది కానీ, ఎప్పుడూ అవకాశం దొరకలేదు. అయితే చిత్రపరిశ్రమలోకి వచ్చాక బయట జీవితం వేరు, సినిమాలు వేరు అని అర్థమైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో షూటింగుల వివరాలు, నేను పనిచేసిన హీరోలకు సంబంధించిన కబుర్లను నా ఫ్రెండ్స్ అడిగేవారు. కొత్త కాబట్టి నేనూ చాలా చెప్పేదాన్ని. ఇక తర్వాత నుంచి అంతా నార్మలైపోయింది. అన్నట్లు నేను మొదటిసారి చూసిన స్టార్స్ ఎవరో తెలుసా.. ఉపేంద్ర, కృతి కర్బంద. బెంగళూరులో చదువుకునే రోజుల్లో ‘ఫ్రెష్ ఫేస్’ అనే కాంపిటీషన్లో వాళ్లని చూశా. తర్వాత ముంబైకి వెళ్లినప్పుడు అక్షయ్ కుమార్, రానాలను చూశా” అని రష్మిక వివరించింది.
Also Read :
