Ramya Krishna: అసలు ఈ సినిమా ఎవరైనా చూస్తారా..? అని అడిగాను.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్

ఇప్పటికే సినీ ప్రముఖులకు ప్రీమియర్స్ వేసి సినిమా చూపించారు కృష్ణవంశీ.. సినిమా చూసిన వారంతా సినిమా అద్భుతంగా ఉందని.. ఎమోషన్స్ చాలా బాగున్నాయని.. గుండె బరువెక్కిందని అంటున్నారు.

Ramya Krishna: అసలు ఈ సినిమా ఎవరైనా చూస్తారా..? అని అడిగాను.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
Rangamarthanda
Follow us

|

Updated on: Mar 21, 2023 | 6:58 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఉగాది సందర్భంగా మర్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ తెరకేకించిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖులకు ప్రీమియర్స్ వేసి సినిమా చూపించారు కృష్ణవంశీ.. సినిమా చూసిన వారంతా సినిమా అద్భుతంగా ఉందని.. ఎమోషన్స్ చాలా బాగున్నాయని.. గుండె బరువెక్కిందని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోవడం కష్టం అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఇక ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తమ పాత్రల్లో ఒదిగిపోయారని.. నటనతో కట్టిపడేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నటి రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సినిమా మొదలవ్వక ముందు.. ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని రమ్యకృష్ణ అన్నారు. రంగమార్తాండ సినిమా నటసామ్రాట్ కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే నటసామ్రాట్ సినిమాను నేను చూశాను. ఇలాంటి సినిమాను తీస్తే ఎవరు చూస్తారు అని నేను కృష్ణవంశీకి అడిగాను..

అయితే ఆయన మాత్రం తన మాట వినకుండా సినిమాను మొదలు పెట్టేశారట. అలాగే ఈ సినిమా హీరోయిన్ కోసం చాలా మందిని సంప్రదించారు. ఎవ్వరూ సెలక్ట్ కాకపోవడంతో నేను ఆ పాత్ర చేశాను అన్నారు రమ్యకృష్ణ. నేను ఎమోషనల్ సినిమాలు చూడను. కానీ ఈ సినిమాలో నేను కళ్లతోనే నటించాలని కృష్ణవంశీ చెప్పారని రమ్యకృష్ణ అన్నారు.