రామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..సిల్వర్ స్క్రీన్ పైనే
ఇస్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీలో రీ సౌండ్ ఇచ్చే హిట్ నమోదు చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ప్రస్తుతం ఈ కుర్ర హీరో తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిది పడింది. అయితే లాక్డౌన్ మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్లో రిలీజ్ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై.. రామ్ […]

ఇస్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీలో రీ సౌండ్ ఇచ్చే హిట్ నమోదు చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ప్రస్తుతం ఈ కుర్ర హీరో తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిది పడింది. అయితే లాక్డౌన్ మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్లో రిలీజ్ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై.. రామ్ డైలమాలో ఉన్నాడా? అని ఓ న్యూస్ పేపర్ లో వచ్చింది. ఆ వార్తను పోస్టు చేస్తూ ఓ ఫ్యాన్… రామ్ డైలమాలో ఉన్నాడా ? ఎంత లేట్ అయిన పర్లేదు అన్నా. సినిమాని థియేటర్లో విడుదల చేయండి. థియేటర్స్లో వచ్చే వరకు మేం అదే ప్రేమతో , ఓపికతో ఉంటాం అని పేర్కొన్నాడు.
నెటిజన్ ట్వీట్కు హీరో రామ్ ఆన్సర్ ఇచ్చాడు. ఎటువంటి డైలమాలో లేనని తేల్చి చెప్పాడు. నిజానికి అతడు గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ , స్వీయ నిర్భంధంలో ఇంట్లోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. గత 15 ఏళ్లుగా జరుగుతున్నట్లుగానే… తన అభిమానులందరూ రెడ్ సినిమాని బిగ్ స్క్రీన్పైనే చూడాలని కోరుకుంటున్నాడు అని తన ట్విట్టర్లో వెల్లడించాడు. రామ్ వివరణతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Nope! #RAPO is not in any dilemma..in fact he’s been chilling at home following the Government’s rules on Social Distancing & Home Quarantine.( like he’s been doing for the past 15 years or so..?♂️) & also, he’s waiting to see his fans watch #RedTheFilm on the BIG SCREEN!? https://t.co/MKxoIK9KFF
— RAm POthineni (@ramsayz) April 11, 2020
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ మూవీకి..మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. తమిళ చిత్రం ‘తదమ్’ స్టోరీ లైన్ ఆధారంగా రెడ్ థీమ్ తీసుకున్నాడు దర్శకుడు. మూవీ టైటిల్ మాదిరిగానే స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటాయని డైరెక్టర్ తిరుమల కిషోర్ వెల్లడించారు.
