AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pithapuram Lo: ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే సినిమా ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’

నట కిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పిఠాపురంలో.. అలా మొదలైంది'.. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

Pithapuram Lo: ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే సినిమా 'పిఠాపురంలో.. అలా మొదలైంది'
Pithapuram Lo Ala Modalaindi Movie
Basha Shek
|

Updated on: Sep 13, 2026 | 6:00 PM

Share

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను.’ అని అన్నారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ యోగ్యుడైన దర్శకుడు. ఆయన మంచి వ్యక్తి. ఈ చిత్రంతో చంద్ర మహేష్‌కి మంచి విజయం దక్కాలి. చంద్ర మహేష్ నిర్మాతల డైరెక్టర్. ఇలాంటి ఉత్తమ దర్శకుడు మరిన్ని సినిమాల్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నాను. చైతన్య రెడ్డి గారు ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘‘చంద్ర మహేష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని నిర్మించిన దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాతలకు మంచి లాభాలు దక్కాలి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘‘నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ గారు ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు. సి.నారాయణరెడ్డి గారు కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడ్పిస్తున్నావంటూ నాకు ‘నటకిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం. ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది. చంద్ర మహేష్ ఎలాంటి దర్శకుడో నాకు ముందు నుంచీ తెలుసు. ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. చంద్ర మహేష్ అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది. ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు తను. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో వుండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ వుంది. దాంతోపాటే ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో వున్నాయి. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ దణ్ణంపెట్టి చెబుతున్నా. దయచేసి ఒక మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి’’ అన్నారు. తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ అనంత గిరి మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అని టైటిల్ చూసినప్పుడే సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే నడుస్తున్నాయి. మంచి సినిమాల్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మరోస్థాయిలో ఉంటుంది’ అని అన్నారు. దర్శకుడు రాం ప్రసాద్ మాట్లాడుతూ .. ‘’పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రాబోతోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా సెప్టెంబర్ 18న విడుదలవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమ, పెళ్లిళ్లు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కుటుంబానికి, తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ నాకు మంచి మిత్రుడు. ప్రస్తుతం ఉన్న తరానికి నచ్చేలా సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం థియేటర్‌లకు ఆడియెన్స్ వస్తున్నారు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని మీడియా సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రంలో తండ్రీ, కూతుళ్ల మధ్య రిలేషన్‌ను అద్భుతంగా చూపించారు. అనుభవం ఉన్న వారు చెప్పే సలహాల్ని పిల్లలు పాటించాలి. చిన్న నిర్మాతలకు, కొత్త వారికి మేం ఎప్పుడూ అండగా ఉంటాం’ అని అన్నారు. దర్శక రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ .. ‘ప్రేమలు, పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్ ఉన్నంత వరకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ ఉంటుంది. తండ్రీకి, కూతురికి జరిగే అద్భుతమైన సంఘర్షణ ఇందులో ఉంటుంది. మహేష్ చంద్ర గారు డ్రామాను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. ఈ సినిమాని అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు. నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ .. ‘‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతీ తల్లి, తండ్రి, కూతురు చూడాల్సిన సినిమా’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us