AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్ నటుడు..

నిర్మాత అశోక్ కుమార్ తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు. అలాగే విలన్ పాత్రలతోనూ జనాలకు దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదట రాజశేఖర్ గారితో ప్లాన్ చేసినప్పటికీ, వెంకటేష్ తో చేయడం ఎలా సాధ్యమైందో తెలిపారు. స్కార్‌ఫేస్ నవల ఆధారంగా, దాదాపు 112 రోజులు చిత్రీకరణతో, బడ్జెట్ అంచనాలను మించి నిర్మించిన ఈ సినిమా విజయ రహస్యాలు, ఎదురైన ఆకస్మిక అడ్డంకులను పంచుకున్నారు.

Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్ నటుడు..
Ashok Kumar
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2026 | 10:07 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితులైన నిర్మాత అశోక్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన రెండు విజయవంతమైన చిత్రాలు రక్త తిలకం, ధృవ నక్షత్రం వెనక ఉన్న అనేక ఆసక్తికరమైన, వ్యక్తిగత సంఘటనలను పంచుకున్నారు. ఆయన మొదటగా రక్త తిలకం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత, తదుపరి చిత్రం ధృవ నక్షత్రం గురించి ప్రస్తావించారు. ధృవ నక్షత్రంను మొదట రాజశేఖర్ తో చేయాలని అశోక్ కుమార్ ప్లాన్ చేసుకున్నారు. జై బాబు తో మాట్లాడి, నాగేశ్వరరావు ని దర్శకుడిగా అనుకున్నారు. అయితే జై బాబు సినిమా వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో, వెంకటేష్ తో సినిమా చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ సమయంలో సామర్లకోటకు చెందిన తన గురువు గణపతి శాస్త్రి, రక్త తిలకం రిలీజ్‌కు ముందుగానే అశోక్ కుమార్‌కు తదుపరి సినిమా కూడా వస్తుందని జోస్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు.

ధృవ నక్షత్రం కథాంశం స్కార్‌ఫేస్ అనే ఆంగ్ల నవల ఆధారంగా రూపొందింది. మలయాళంలో వచ్చిన ఆర్యన్ చిత్రం కూడా దీని స్ఫూర్తితోనే తెరకెక్కింది. ఈ సబ్జెక్టు సురేష్ ప్రొడక్షన్స్ వారికి నచ్చడంతో, పరిచూరు బ్రదర్స్ సూచన మేరకు వెంకటేష్ తో ఈ సినిమా ఖరారైంది. అయితే దర్శకుడు నాగేశ్వరరావు గారి నిర్ణయాలలో కొంత గందరగోళం ఉండటం వల్ల సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టింది. అనుకున్న బడ్జెట్ కంటే 50% ఎక్కువగా, 112 రోజులు చిత్రీకరణ జరిగిందని, దాదాపు 1,40,000 ఫుటేజ్ ఎక్స్‌పోజ్ అయ్యిందని అశోక్ కుమార్ వెల్లడించారు. దాసరి నారాయణరావు గారితో ఈ సినిమా తీసి ఉంటే 60-70 రోజుల్లో పూర్తయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ధృవ నక్షత్రం విడుదలైన మొదటి వారం రక్త తిలకం వసూళ్లకు సమానంగా కలెక్షన్లు సాధించి గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, అశోక్ కుమార్ దురదృష్టవశాత్తూ, రెండో వారంలో అంకుశం చిత్రం విడుదల కావడంతో, అది ధృవ నక్షత్రం కలెక్షన్లను ప్రభావితం చేసింది. అంతేకాకుండా, తాను పెట్టుబడులు పెట్టిన కొన్ని ఏరియాలలో మూడో వారం వరదలు రావడంతో, ముఖ్యంగా ఏలూరు ఐదు రోజులు నీట మునిగిపోవడం వల్ల సినిమా వసూళ్లకు ఆటంకం ఏర్పడిందని అశోక్ కుమార్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. సురేష్ బాబు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us