AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: అప్పుడే మొదటిసారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. ప్రభాస్ ఎమోషనల్ .. వీడియో వైరల్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చివరగా కల్కి 2898 ఏడీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్..ఇటీవల కన్నప్ప మూవీలో అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

Prabhas: అప్పుడే మొదటిసారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. ప్రభాస్ ఎమోషనల్ .. వీడియో వైరల్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2025 | 7:27 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరకు కల్కి సినిమాతో హిట్టుకొట్టిన ప్రభాస్.. ఇటీవలే మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాల చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రివీల్ చేస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఆ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. “నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చింది అప్పుడే. ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ డైలాగ్ చెప్పాను. ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు. ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు అని చెప్పాను.అది ఎలా చెప్పానో నాకు తెలియదు. కానీ టెన్షన్ లోనే చెప్పేశా. అప్పుడు మా నాన్న నా చెయి పట్టుకుని యస్ అన్నారు. అప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. ప్రభాస్ మొదటి సినిమా సమయంలోతన తండ్రి ఆశీస్సులు ఎంత కీలకమయ్యాయో వివరించారు.

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ఆ తర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన డార్లింగ్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలు షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు త్వరలోనే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..