పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోషలో ఉన్నాడు. సలార్, కల్కి సినిమాల రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు డార్లింగ్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి ఏకంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దీంతో ప్రభాస్ రాబోయే సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక డార్లింగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. సలార్, కల్కి సీక్వెల్స్ తో పాటు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, అలాగే హను రాఘవ పూడి డైరెక్షన్ లో ఫౌజి, సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్.. ఇలా ప్రభాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వీటన్నిటి కంటే ముందు మారుతి రాజాసాబ్ సినిమానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే రాజా సాబ్ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 150 నుంచి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే రాజా సాబ్ కోసం డార్లింగ్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ సినిమా నిరాశపరచడంతో ఈ నిర్మాణ సంస్థకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో అదే సమయంలో ప్రభాస్ వారికి సాయం చేస్తానని మాటిచ్చాడట. అప్పటికే రాజా సాబ్ సినిమా కూడా ఓకే అయిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడట. తద్వారా ఆదిపురుష్ నష్టాలను ఎంతో కొంత పూడ్చటానికి తన వంతు సాయం చేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీని గురించి తెలుగుసుకున్న ప్రభాస్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ‘డార్లింగ్ నిర్మాతల హీరో’.. ‘ప్రభాస్ ప్రేమకు ఇదో ఉదాహరణ’ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
With 67 lakh tickets sold, Kalki 2898 AD is taking the cinemas by storm! ⚡Don’t miss out—book your tickets now at PVR INOX.
Now screening at PVR INOX!
Book now: https://t.co/WyiWtS0CBM
.
.
.#Prabhas #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan #Kalki2898AD pic.twitter.com/AmKsnaFx77— P V R C i n e m a s (@_PVRCinemas) July 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.