Devara Movie: దేవర డబ్బింగ్ స్టార్ట్.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మొదటిసారి ఎన్టీఆర్, జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Devara Movie: దేవర డబ్బింగ్ స్టార్ట్.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Devara
Follow us

|

Updated on: Jul 11, 2024 | 3:23 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దేవర ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మొదటిసారి ఎన్టీఆర్, జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా దేవర సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేవర సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్ లీక్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. “సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..” అనే డైలాగ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ డైలాగ్ వింటే థియేటర్లు దద్ధరిల్లడం ఖాయంగా తెలుస్తోంది.

అలాగే చాలా కాలం ఎదురుచూస్తున్న తారక్ అభిమానులకు ఈసారి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించనున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీతోపాటు హిందీలో వార్ 2 చిత్రంలో కూడా తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న ఈ మూవీలో తారక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవర తర్వాత కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు తారక్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ మూవీపై మరింత అంచనాలు పెంచేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.