
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చి బాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఐదురోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన పెద్ది సినిమా ఓవరాల్ గా ఇప్పటివరకు రూ. 315 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కాగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన పెద్ది సినిమా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. అతని తర్వాత ఈ మూవీలో బాగా హైలెట్ అయ్యింది జగ్గూ భాయ్. అప్పల సూరి పాత్రలో ఆయన నటన ఆడియెన్స్ తో కన్నీరు పెట్టించింది. కాగా పెద్ది ప్రమోషన్లలో జగ్గూ భాయ్ కూడా పాల్గొంటున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. విషయమేదైనా ముక్కుసూటిగా మాట్లాడే జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
‘నేను సిల్వర్ స్క్రీన్పై నటిస్తున్నాను. బయట నటిస్తూ బతకాల్సిన అవసరం నాకు లేదు. నిజానికి ‘జీవితంలో నేను అబద్ధం చెప్పలేదు’ అని ఎవరైనా చెబితే.. అదే పెద్ద అబద్ధం అవుతుంది. కానీ నిజం చెప్పి కూడా బతకొచ్చు అని నాకు బాగా అర్థమైంది. అందుకే నిజాలు దాచి పెట్టడం, ప్రతి దానికి అబద్దాలు ఆడాల్సిన అవసరమేముంది? అని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచే ఇలా ముక్కు సూటిగా, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను’. కాగా బతికి ఉండగానే తాను చనిపోయినట్లు వార్తలు రావడంపై జగ్గూ భాయ్ స్పందిస్తూ.. ‘సోషల్ మీడియాలో నేను చనిపోయానంటూ తప్పుడు వార్తలు ప్రచారమైన సందర్భాలు కూడా ఉన్నాయి. నా డెడ్ బాడీ పక్కన ఎన్టీఆర్ తో పాటు ఇతర హీరోలు ఏడుస్తున్నట్లుగా ఉన్న ఎడిట్ చేసిన దృశ్యాలను కూడా నెట్టింట వైరల్ చేశారు. కానీ అలాంటి వాటి గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కొందరు నన్ను చంపేసినా.. నేను మాత్రం నిజాయతీతో జీవిస్తున్నాను’ అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగ్గూభాయ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb
— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి