బాలయ్య అంటే మాస్ ప్లస్ ఎమోషన్. దుమ్మలేపే డైలాగులు ఎలా చెప్తారో..మనసును కదిలించే ఎమోషన్ అలానే పండిస్తారు. ప్రజంట్ నటసింహం పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మధ్యలో చాలాపేర్లు వినిపించినప్పటికీ ఎవరూ ఫైనల్ అవ్వలేదు. తాజాగా ఈ మూవీ కోసం ముంబైకి చెందిన ఓ కొత్త నటిని పరిశీలిస్తున్నారట. ఈ సినిమా ద్వారా కొత్త హీరోయిన్ ను ఇంట్రడ్యూస్ చేస్తానని బోయపాటి గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా నార్త్ మోడళ్లతో సంప్రదింపులు జరిపారట. త్వరలోనే ఓ కొత్త భాయను ఈ సినిమాకు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి
మరోవైపు ఈ మూవీలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను అప్రోచ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూవీ యూనిట్ సంజయ్ తో సంప్రదింపులు జరిపారని, అందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా..బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతుంది. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా వచ్చిన ‘ఫస్ట్ రోర్’ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాతే మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.