తారకరత్న కాపాడుకునేందుకు బాలయ్య చేయని ప్రయత్నం లేదు. ఎందరో దేవుళ్లకు పూజలు చేశారు. హోమాలు జరిపించారు. అఖండ జ్యోతి వెలిగించారు. విదేశాల నుంచి డాక్టర్లను పిలిపించి మరీ వైద్యం చేయించారు. కానీ తారకరత్న శరీరం ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాలేదు. 23 రోజుల పాటు ఆస్పత్రిలో అన్నీ తానై చూసుకున్నాడు బాలయ్య. బిడ్డను ఆ పరిస్థితుల్లో చూసి.. ఓవైపు బాధను పంటకింద భరిస్తూ.. మరోవైపు తారకరత్న భార్యబిడ్డలకు ధైర్యం చెబుతూ వచ్చాడు. కానీ తరలిరాని లోకాలకు వెళ్లిపోయాడు తారకరత్న. ఇప్పుడు భార్య, ముగ్గురు పిల్లల సంగతి ఏంటి…? ఇంత చిన్న వయస్సులో ఎంతో ప్రేమించిన భర్తను కోల్పోయి.. మానసిక సంఘర్షణకు లోనవుతుంది అలేఖ్య రెడ్డి. అటు పిల్లల.. అమాయకపు చూపులు అయితే కంటతడి పెట్టిస్తున్నాయి.
ఏం పర్లేదమ్మా… పోయిన మనిషిని తీసుకురాలేడు బాలయ్య. కానీ ఉన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తారకరత్న భార్యపిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని బాలయ్య చెప్పినట్లు ఇప్పటికే వెల్లడించారు విజయసాయి రెడ్డి. ఆదివారం బాలయ్య వెళ్లగానే తారకరత్న పెద్ద కుమార్తె వెళ్లి… ఆయన్ను కౌగిలించుకున్న తీరు చేస్తేనే.. వారి మధ్య బాండింగ్ అర్థమైపోతుంది. తాజాగా తారకరత్న పిల్లలతో (N)నిషిక, (T)తనయ్ రామ్,(R) రేయాలతో
మరిన్ని తెలంగాణ వార్తల కోసం