Manisharma: చిరంజీవికి ఇష్టం లేకపోయిన బాలును తప్పించి ఆ సింగర్‏తో పాట పాడించాను.. ఆసక్తికర విషయాలు చెప్పిన మణిశర్మ..

|

Nov 23, 2022 | 8:51 AM

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంగీతం అందించిన మణి.. చాలా కాలం తర్వాత ఇటీవల మాస్ డైరెక్టర్ కొరటాల శివ.. చిరు కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Manisharma: చిరంజీవికి ఇష్టం లేకపోయిన బాలును తప్పించి ఆ సింగర్‏తో పాట పాడించాను.. ఆసక్తికర విషయాలు చెప్పిన మణిశర్మ..
Megastar Chiranjeevi, Manis
Follow us on

మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఈ పేరు చెప్పగానే మనసుకు హత్తుకునే ఎన్నో అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. ఇప్పటికీ ఆయన సృష్టించిన సాంగ్స్ సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒకటి రెండు చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంగీతం అందించిన మణి.. చాలా కాలం తర్వాత ఇటీవల మాస్ డైరెక్టర్ కొరటాల శివ.. చిరు కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఎప్పుడూ రియాల్టీ షోలలో కనిపించని ఈ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా బుల్లితెరపై సందడి చేశారు మణి. ప్రముఖ నటుడు అలీ నిర్వహిస్తున్న అలీతో సరదాగా షోకు అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలోనే తన కెరీర్.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

సంగీతం నేర్చుకునే విషయంలో తన తండ్రి పండితుడని..తాను పరమ శుంఠనని సరదాగా అన్నారు. అలాగే చిరంజీవికి ఇష్టం లేకపోయినా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమహ్మణ్యాన్ని తప్పించి ఉదిత్ నారాయణతో రామ్మా చిలకమ్మా ఎందుకు పాడించాల్సి వచ్చిందో చెప్పారు. ఏఆర్ రెహమాన్.. తానూ కీబోర్డ్ ప్లేయర్లుగా పనిచేసినట్లు తెలిపారు. ఇక చివరగా తమన్ వచ్చిన తర్వాత మణిశర్మ అక్కర్లేదు.. అనుకునేవాళ్లకు మీ సమాధానం ఏంటీ ? అని అడగ్గా.. కాలమే సమాధానమే అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.