
కేవలం హీరోగానే కాకుండా సేవ కార్యక్రమాల్లో ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. అలాగే ఎంతో మందికి సాయం చేసి దేవుడయ్యారు. మెగాస్టార్ గొప్పమనసుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ఒకటి. ఎంతో మంది ప్రాణాన్ని నిలిపింది చిరంజీకి బ్లడ్ బ్యాంక్. అలాగే చూపులేని ఎంతో మందికి కంటి వెలుగు ఇచ్చింది చిరంజీవి ఐ బ్యాంక్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అలాంటి కళ్ళను దానం చేయడం చాలా గొప్ప విషయం.
కళ్లు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది. తెలుగు చిత్ర సీమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ మేకప్ మ్యాన్ కొల్లి రాము సోదరి పమిడి ముక్కల రాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం కన్నుమూశారు.
ఈ విషయాన్ని వారు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి చేరవేయగా వెంటనే వారు స్పందించారు. అలా రాజ్యలక్ష్మిగారు తాను చనిపోయినప్పటికీ నేత్రదానం చేయటం ద్వారా మరో ఇద్దరికీ చూపును అందించి ఎందరికో ఆదర్శప్రాయంగా మారారు. ఈ సందర్భంగా మురళీమోహన్కి, కొల్లి రాము ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి ధన్యవాదాలను తెలియజేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..