‘మహర్షి’ ఫస్ట్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్

| Edited By:

Mar 23, 2019 | 9:53 AM

మహేశ్ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పేసింది ‘మహర్షి’ టీం. మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘మహర్షి’ మే9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 29న ‘మహర్షి’ ఫస్ట్ సింగిల్ రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసిన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్.. ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో చారుశీల పాటను దేవీ శ్రీ పాడుతుండగా.. మహేశ్ […]

‘మహర్షి’ ఫస్ట్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్
Follow us on

మహేశ్ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పేసింది ‘మహర్షి’ టీం. మహేశ్ 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘మహర్షి’ మే9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 29న ‘మహర్షి’ ఫస్ట్ సింగిల్ రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసిన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్.. ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో చారుశీల పాటను దేవీ శ్రీ పాడుతుండగా.. మహేశ్ బాబు కుమార్తె సితార, వంశీ పైడిపల్లి కుమార్తె డ్యాన్స్ చేస్తున్నారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న మహర్షిలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేశ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. మహేశ్ ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.