AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న స్టార్ నటుడు ఎవరో గుర్తించండి.. ఆయన సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసే వ్యక్తి

సోషల్ మీడియా అంటేనే ట్రెండింగ్ అప్‌డేట్స్. అందునా ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, లేటెస్ట్ రీల్స్, వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న స్టార్ నటుడు ఎవరో గుర్తించండి.. ఆయన సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసే వ్యక్తి
ఈ చిత్రంలోని స్టార్ ఎవరో కనిపెట్టండి..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 15, 2021 | 1:36 PM

సోషల్ మీడియా అంటేనే ట్రెండింగ్ అప్‌డేట్స్. అందునా ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, లేటెస్ట్ రీల్స్, వీడియోలు.. వారి చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు అంటే పేపర్ ద్వారా వార్తలు తెలిసేవి.. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రతి విషయం జనానికి తెలిసిపోతుంది. సీనియర్ స్టార్స్ సైతం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు.  తాజాగా టాలీవుడ్ బిగ్ స్టార్ తన మనవరాలికి.. తన సూపర్ హిట్ ఫిల్మ్ స్టోరీని వివరిస్తున్నారు. ఇంతకీ ఆయనెవరో గుర్తించారా.. నడిచే నక్షత్రం అండీ.. యస్.. మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి..తెలుగు తెరపై తిరుగులేని స్టార్. అన్న ఎన్టీఆర్ తర్వాత 3 దశాబ్ధాలు పాటు తెలుగు తెరను ఏలిన చక్రవర్తి ఆయన. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి… సిల్వర్ స్రీన్‌ లెజెండ్‌గా.. ‘ఆంధ్రుల అభిమాన అన్నయ్య’గా  పేరు తెచ్చుకున్న వ్యక్తి చిరంజీవి. మధ్యలో 9 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అనంతరం ‘ఖైదీ నెం. 150’ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన బాస్‌ అదే గ్రేస్.. అదే మాస్‌తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తనయుడి రామ్ చరణ్‌ కంటే వేగంగా సినిమాలు చేస్తూ.. దుమ్మురేపుతున్నారు చిరంజీవి.

అయితే మెగాస్టార్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను, ఆలోచనలను, తన కొత్త సినిమాలు అప్‌డేట్స్ తెలియజేస్తున్నారు చిరంజీవి. ఇక కుటుంబంతో గడపడానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తన పెద్ద కుమార్తె సుస్మిత కూతురుకు.. ‘చూడాలని ఉంది’ స్టోరీ చెబుతున్నారు చిరంజీవి. చిన్నారి కూడా ఆ కథను ఎంతో ఆసక్తికరంగా వింటుంది. ఈ వీడియోను షూట్ చేసిన సుస్మిత ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ వీడియో పాతదే అయినప్పటికీ.. ఇప్పుడు నెట్టింట మరోసారి ట్రెండ్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Sushmita (@sushmitakonidela)

Also Read: మల్టీస్టారర్‌‌పై బాలయ్య కీలక స్టేట్మెంట్.. ఏపీలో టికెట్ ధరలపై తన మార్క్ కామెంట్స్