మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కెమెరా ముందుకు చాలా కాలం అయ్యింది. గత సంవత్సరం వినాయక చవితి రోజున తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. రిపబ్లిక్ సినిమా సమయంలో తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. తేజ్ కు యాక్సిడెంట్ జరిగిందని తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందారు. గత ఏడాది సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇప్పుడు తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల పలు కార్యక్రమాలకు కూడా తేజ్ హాజరయ్యాడు. అలాగే రీసెంట్ గా ఫోటో షూట్ లో కూడా చేశారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దాదాపు ఏడు నెలలు విశ్రాంతి తీసుకున్న తేజ్ . ఇటీవలే విజయవాడ కనక దుర్గ అమ్మవారిని ఫ్యామిలీతో కలిసి వెళ్లి దర్శించుకున్నాడు. ఇక ఇప్పుడు కెమెరా ముందుకు రానున్నాడు. గతంలో మార్చి 28న మంగళవారం ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు తేజ్. చెప్పినట్టుగానే నేడు తన అప్ కమింగ్ మూవీ అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు తేజ్. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు (మంగళవారం) నుంచి మొదలైంది. తాజాగా ఓ వీడియోని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. సెట్ లో వున్న గుడిలో పూజ అనంతరం సాయి ధరమ్ తేజ్ సెట్ లోకి అడుగుపెట్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి :