AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

తెలుగులో వరుసగా హిట్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడింది. ఒక్కసారి కాదు.. రెండుసార్లు క్యాన్సర్ తో పోరాటం చేసింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది.

Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
Mamta Mohandas
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2026 | 3:58 PM

Share

మలయాళీ సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు కథానాయికగా మెప్పించిన ఈ అమ్మడు.. ఇటు అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మమాత మోహన్ దాస్. ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆమె నటిగా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడింది. రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడిన ఆమె.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

యమదొంగ సినిమా కంటే ముందు తనకు తెలుగులో ఓ సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపింది. అదే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న అరుంధతి. ఈ సినిమాకు సైన్ చేసి.. కొన్ని రోజులకే మూవీ నుంచి తప్పుకుందట. ఆ ప్రొడక్షన్ హౌస్ అంత మంచిది కాదు అని తన మేనేజర్ చెప్పడంతో అరుంధతి సినిమా నుంచి తప్పుకున్నారట. అప్పట్లో తనకు తెలుగు సినిమాల గురించి అంతగా తెలియదని.. తెలుగు భాష గురించి అసలు అవగాహాన లేదని అన్నారు. అరుంధతి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తన మేనేజర్ చెప్పిన మాటలు విని వదిలేశానని అన్నారు. ఆ సినిమాలో నటించాలని రెండు మూడు నెలలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అడుగుతూనే ఉన్నారు. కానీ ఆయన మాటలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ ఏడాది తర్వాత రాజమౌళి ఫోన్ చేసి యమదొంగ సినిమా ఛాన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

యమదొంగ అడిషన్ కు వెళ్లినప్పుడు రాజమౌళి మాట్లాడుతూ.. అరుంధతి సినిమాను వదులుకోకుండా నువ్వు చేయాల్సింది. పెద్ద తప్పు చేశావు అని అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అలా అనడంతో నా గుండె పగిలిపోయింది అంటూ మమతా మోహన్ దాస్ చెప్పుకోచ్చారు. అరుంధతి సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.

View this post on Instagram

A post shared by Mamta Mohandas (@mamtamohan)

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us