Mahesh Babu: ఈ క్రేజ్ ఏంటి సామీ.. ఫోన్ పేలో మహేశ్.. 5 సెకన్ల వాయిస్‌కు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?

|

Feb 24, 2024 | 2:08 PM

సాధారణంగా ఫోన్‌ పే నుంచి నగదు లావాదేవీలు చేసే టప్పుడు.. మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే త్వరలోనే ఆ వాయిస్ స్థానంలో మహేశ్ స్వీట్‌ వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం ఫోన్‌ పే ప్రతినిధులు మహేశ్‌ వాయిస్ శాంపిల్స్ తీసుకుని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారట.

Mahesh Babu: ఈ క్రేజ్ ఏంటి సామీ.. ఫోన్ పేలో మహేశ్.. 5 సెకన్ల వాయిస్‌కు ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?
Mahesh Babu
Follow us on

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రొడ్యూసర్లు ఎలా పోటీ పడతారో యాడ్స్, ప్రకటనలు చేసేందుకు కంపెనీలు కూడా అలాగే క్యూ కడతాయి. అలా తాజాగా మరో ప్రముఖ సంస్థకు అంబాసిడర్ గా మారిపోయారు మహేశ్‌ బాబు. డిజిటల్ మనీ ట్రాన్సఫర్ యాప్‌, ఫోన్‌ పే యూపీఐకు తన గొంతును అరువుగా ఇచ్చేశారీ సూపర్ స్టార్‌. సాధారణంగా ఫోన్‌ పే నుంచి నగదు లావాదేవీలు చేసే టప్పుడు.. మనీ రిసీవ్డ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే త్వరలోనే ఆ వాయిస్ స్థానంలో మహేశ్ స్వీట్‌ వాయిస్ వినిపించనుంది. ఇందుకోసం ఫోన్‌ పే ప్రతినిధులు మహేశ్‌ వాయిస్ శాంపిల్స్ తీసుకుని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారట. తెలుగులో మహేశ్ బాబు వాయిస్‌లాగానే ఇతర భాషల స్టార్ హీరోలతో కూడా ఫోన్ పే అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, కన్నడ భాషలో కిచ్చా సుదీప్‌, మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో ఫోన్ పే చర్చలు జరిపిందట. ఉదాహరణకు.. ఫోన్ పేలో చెల్లింపు చేస్తే.. ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ మహేశ్ బాబు చెబుతాడట. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే ఇది కొత్త‌గా వ‌చ్చింది కాదు. గతంలో బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఇదే తరహాలో వాయిస్‌ను అందించారు.

అయితే ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష్ కు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం చెల్లించారట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గుంటూరు కారంతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు మహేశ్ బాబు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇది సుమారు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 సినిమాలో నటిస్తున్నాడు మహేశ్ బాబు.

ఇవి కూడా చదవండి

 

 

ఫోన్ పేకు థ్యాంక్స్ చెప్పిన మహేశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.