బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!

| Edited By: Anil kumar poka

Nov 27, 2021 | 12:17 PM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువైంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్‌కు కొదవలేదు. ఫోటోల దగ్గర నుంచి వీడియోల వరకు..

బిందె పట్టుకుని ఫోటోకి పోజిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.. ఎవరో కనిపెట్టండి!
Tollywood Heroine
Follow us on

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువైంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్‌కు కొదవలేదు. ఫోటోల దగ్గర నుంచి వీడియోల వరకు.. సినీ అప్‌డేట్స్ నుంచి తమ అభిమాన నటీనటుల క్రేజీ ఫోటోల వరకు అన్నీ కూడా ఫ్యాన్స్‌కు దొరుకుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నెట్టింట త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ కొనసాగుతోంది. సాధారణంగా హీరోయిన్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు అప్‌లోడ్ చేస్తే చాలు.. ఫ్యాన్స్ వాటిని క్షణాల్లో వైరల్ చేసేస్తారు. ఈ కోవలోనే చాలామంది స్టార్ హీరోయిన్ల ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ కోవలోనే ఓ యువ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో బిందె పట్టుకుని పోజిస్తున్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ‘అందాల రాక్షసి’గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది.. ఆమెవరో కాదు లావణ్య త్రిపాఠి.

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా లావణ్య.. ‘భలే భలే మగాడివో’ చిత్రంలో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘అర్జున్ సురవరం’ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా, త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలో సెకండ్ హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటించనుందని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: కొండచిలువతో క్రేజీ ఆటలు.. గుడ్లను పట్టుకోబోయిన వ్యక్తిని ఏం చేసిందో చూస్తే షాకవుతారు!

ఈ 6 రాశులవారికి వచ్చే సంవత్సరం అదృష్టం వరిస్తుందట.. ఏయే రాశులంటే!

ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్.. 21 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. అసలు స్కోర్ ఎంతంటే?