Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..

|

Feb 20, 2022 | 8:46 AM

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కీర్తి సురేష్ (Keerthy Suresh). మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది కీర్తి.

Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..
Follow us on

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కీర్తి సురేష్ (Keerthy Suresh). మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది కీర్తి. ఈ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళం వరుస ఆఫర్లతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ఫోటోస్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త అవతారంలోకి మారిపోయింది.

తాజాగా కీర్తి సురేష్ మలయాళంలో వాషీ అనే సినిమా చేస్తోంది. ఇందులో మిన్నాల్ మురళి ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్నారు. రేవతి కళామందిర్ బ్యానర్ పై జి. సురేష్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కీర్తి, టివినో థామస్ ఇద్దరూ న్యాయవాదులుగా కనిపించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలుగు సమంత, మహేష్ బాబు, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో అభిషేక్ బచ్చన్ త్రిష, ఏ ఆర్ రెహమాన్ తమిళంలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని దాదాపు ఐదు భాషలలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Prabhas: ఆయనో ప్రతిభావంతుడు.. వినయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా: ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బీ

Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..

Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..