NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..

|

May 09, 2022 | 7:39 AM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..
Ntr
Follow us on

కేజీఎఫ్ 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డుకెక్కింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ .. హీరోయిన్ ఆద్య పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమా పై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడు. తారక్ కెరీర్ లోనే 31వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని దసరాకి అధికారికంగా లాంచ్ చేసి.. నవంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరపాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే 2024 దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ నీల్.. తారక్ ఇమేజ్ కి తగినట్టుగా ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Sarkaru Vaari Paata: ఆ నవ్వే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది.. దర్శకుడు పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Macherla Niyojakavargam: రిలీజ్ డేట్ మార్చుకున్న యంగ్ హీరో.. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’లో అడుగు పెట్టేది అప్పుడే.